బొబ్బిలి : విజయనగరం జిల్లా బొబ్బిలిలో విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ గొడవలో ఓ విద్యార్థి మృతిచెందాడు. పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. సహ విద్యార్థి దాడి చేయడంతో 9వ తరగతి విద్యార్థి సుందరాడ కార్తీక్ కిందపడిపోయాడు. దీంతో అక్కడున్నవారు ఆ విద్యార్థిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే విద్యార్థి మృతిచెందినట్లు తెలిపారు.
ఈ ఘటనపై కార్తీక్ తల్లితండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సతీశకుమార్ తెలిపారు. ఘర్షణకు గల కారణాలపై ఆరా తీస్తున్నట్లు చెప్పారు.
Also read
- పోలీస్ స్టేషన్లో కాల్పుల కలకలం.. AK-47తో కాల్చుకుని ఎస్ఐ ఆత్మహత్యాయత్నం!
- మధ్యాహ్న భోజన పథకం కార్మికుల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి….. గ్రీష్మ కుమార్, ఐ.యఫ్టియు రాష్ట్ర కమిటీ సభ్యులు.
- Ganesh Chaturthi: గణేశుడికి ఏనుగు తల ఎలా వచ్చింది? గజాసురుడి తలనే ఎందుకు పెట్టారు.. అసలు కథ ఇదే!
- భాద్రపద మాసం.. వినాయక చవితి నుంచి మహాలయ అమావాస్య వరకు.. ఈ మాసంలోని పండగలివే!
- వినాయక చవితి వేళ అద్భుత గ్రహ యోగాలు.. ఈ రాశుల వారికి గణపతి ఆశీస్సులతో పట్టిందల్లా బంగారమే!





