సీఐడీ విశ్రాంత అదనపు ఎస్పీ విజయ్పాల్ (Vijay paul) ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ ఎదుట విచారణకు హాజరయ్యారు.
ఒంగోలు: సీఐడీ విశ్రాంత అదనపు ఎస్పీ విజయ్పాల్ (Vijay paul) ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ ఎదుట విచారణకు హాజరయ్యారు. ప్రస్తుత ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును గతంలో వైసీపీ హయాంలో చిత్రహింసలకు గురిచేసిన కేసులో ఆయనను విచారిస్తున్నారు.
ఈ కేసులో ఈనెల 13న పోలీసులు విజయ్ పాల్ ను విచారించారు. తనకేమీ తెలియదు.. గుర్తులేదు అంటూ ఆయన అప్పట్లో విచారణాధికారుల ఎదుట చెప్పారు.
మరోవైపు ఈ కేసులో తన ముందస్తు బెయిల్ పిటిషన్ ను కొట్టేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సెప్టెంబర్ 24న ఇచ్చిన తీర్పుపై ఆయన దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషనన్ను సుప్రీంకోర్టు సోమవారం కొట్టేసింది. ఈ క్రమంలో విజయ్పాల్ నేడు విచారణకు హాజరుకావడంతో ఉత్కంఠ నెలకొంది. ఆయన్ను అరెస్ట్ చేసే అవకాశముందన్న ప్రచారం జరుగుతోంది.
Also read
- డాక్టర్ ప్రియాంక మరణంపై హత్య కేసుగా నమోదు చెయ్యాలి KVPS డిమాండ్
- యూనియన్ బ్యాంక్లో అగ్ని ప్రమాదం.. కాలి బూడిదైన ఫైళ్లు
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- ఉదయం పరిచయం.. మధ్యాహ్నం పెళ్లి.. రాత్రికి శోభనం అంటే పరిగెత్తిన వరుడు.. తీరా చూస్తే..!
- రీ సర్వే మహిళా ప్రాణం తీసిందా! కర్నూలు జిల్లాలో ఉద్రిక్తత





