తిరుమల (Tirumala) శ్రీవారి హుండీలో నగదు చోరీ జరిగింది. ఈనెల 23న మధ్యాహ్నం 2 గంటలకు జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
తిరుమల: తిరుమల (Tirumala) శ్రీవారి హుండీలో నగదు చోరీ జరిగింది. ఈనెల 23న మధ్యాహ్నం 2 గంటలకు జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఆలయంలోని స్టీల్ హుండీ నుంచి తమిళనాడుకు చెందిన వేణులింగం నగదు చోరీ చేసి పారిపోయాడు. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా చోరీ జరిగినట్లు భద్రతా సిబ్బంది గుర్తించారు. అదే రోజు సాయంత్రం 6 గంటలకు నిందితుడిని పట్టుకున్నారు. దొంగిలించిన రూ.15వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని తితిదే విజిలెన్స్ అధికారులు పోలీసులకు అప్పగించారు.
Also read
- నేటి జాతకములు 31 జూలై, 2026
- అసంఘటిత కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చెయ్యాలి….పామర్తి సత్యనారాయణ, ఐ.యఫ్.టి.యు .
- ఇంకా దొరకని బాలయ్య ఆచూకీ!
- Shukra Gochar 2026: శుక్రుడి అనుగ్రహం..ఆర్థికంగా ఈ రాశుల వారికి గోల్డెన్ డేస్..!
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?





