అమలాపురం : బండారులంక దంగేటివారిపాలెంలో ఓ వివాహిత ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కడలి సాయివెంకటజ్యోతి(24)కి 2021లో గ్రామానికి చెందిన శిరీష్ వివాహం జరిగింది. పిల్లలు లేకపోవడంతో భర్తతో పాటు అత్తమామలు, బంధువులు సాయివెంకటజ్యోతిని వేధించడంతో తట్టుకోలేక శనివారం ఉదయం ఇంట్లోని ఫ్యాన్కు ఆమె ఉరేసుకున్నారు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అమలాపురం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. మృతురాలి తల్లి సత్యవతి ఫిర్యాదు మేరకు అమలాపురం తాలూకా పోలీసులు కేసు నమోదు చేశారు.
పెండ్లి కుమారుడి అదృశ్యంపై కేసు
ఉప్పలగుప్తం: వివాహమైన మూడో రోజునే పెండ్లి కుమారుడు అదృశ్యమైన ఘటనపై ఉప్పలగుప్తం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఎస్సై కె. జానీబాషా తెలిపిన వివరాల ప్రకారం.. ఉప్పలగుప్తం మండలం గోపవరం గ్రామ యువకుడికి ఏప్రిల్ 29న ఐ.పోలవరం మండలానికి చెందిన ఓ యువతితో వివాహం జరిగింది. మే 1న ఉదయం నుంచి తన కుమారుడు కనిపించడం లేదంటూ తండ్రి పోలీసులకు ఫిర్యాదు. చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శనివారం తెలిపారు.
Also read
- Hyderabad: గచ్చిబౌలిలో దారుణం.. లిఫ్ట్లో చిక్కుకుని ఐదేళ్ల చిన్నారి మృతి!
- మాదాపూర్లో విషాదం: ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య.. ఏం జరిగింది?
- Hyderabad: మరోసారి నేపాలి గ్యాంగ్ హల్చల్.. సీసీ కెమెరాలు ధ్వంసం చేసి, పక్కా ప్లాన్ తో దోపిడీ!
- Garuda Puranam: గరుడ పురాణ హెచ్చరిక: సుఖశాంతులు కావాలా? అయితే ఈ 5 పాపపు పనులకు దూరంగా ఉండండి!
- ద్రౌపది పాండవులను వివాహం చేసుకోవడం వెనుక ఉన్న రహస్యం ద్విజన్మ రహస్యం!





