అమలాపురం : బండారులంక దంగేటివారిపాలెంలో ఓ వివాహిత ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కడలి సాయివెంకటజ్యోతి(24)కి 2021లో గ్రామానికి చెందిన శిరీష్ వివాహం జరిగింది. పిల్లలు లేకపోవడంతో భర్తతో పాటు అత్తమామలు, బంధువులు సాయివెంకటజ్యోతిని వేధించడంతో తట్టుకోలేక శనివారం ఉదయం ఇంట్లోని ఫ్యాన్కు ఆమె ఉరేసుకున్నారు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అమలాపురం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. మృతురాలి తల్లి సత్యవతి ఫిర్యాదు మేరకు అమలాపురం తాలూకా పోలీసులు కేసు నమోదు చేశారు.
పెండ్లి కుమారుడి అదృశ్యంపై కేసు
ఉప్పలగుప్తం: వివాహమైన మూడో రోజునే పెండ్లి కుమారుడు అదృశ్యమైన ఘటనపై ఉప్పలగుప్తం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఎస్సై కె. జానీబాషా తెలిపిన వివరాల ప్రకారం.. ఉప్పలగుప్తం మండలం గోపవరం గ్రామ యువకుడికి ఏప్రిల్ 29న ఐ.పోలవరం మండలానికి చెందిన ఓ యువతితో వివాహం జరిగింది. మే 1న ఉదయం నుంచి తన కుమారుడు కనిపించడం లేదంటూ తండ్రి పోలీసులకు ఫిర్యాదు. చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శనివారం తెలిపారు.
Also read
- ఇదేం పనయ్యా.. ప్రభుత్వ ఉద్యోగంలో లక్షకుపైగా జీతం.. చేసేదేమో చైన్ స్నాచింగ్లు
- 5 నెలలుగా ఇంటికి తాళం.. అనుమానంతో తెరిచిన ఓనర్.. ఒళ్లు గగుర్పాటుకు గురి చేసే దృశ్యం!
- ఏపీ లిక్కర్ స్కామ్లో విస్తుపోయే వాస్తవాలు.. మద్యం మాఫియా మైండ్ బ్లాక్.. రంగంలోకి ఐటీ!
- అరేయ్.. ఏంట్రా ఇది.. హుండీ లెక్కింపు ఉద్యోగాలు.. అంటూ ఉన్నది మొత్తం ఊడ్చేశాడు.. చివరకు
- చిన్న నిర్లక్ష్యం.. పెను ప్రమాదం.. బ్యాటరీ ఛార్జింగ్ పెడుతుండగా పేలుడు.. బాలుడి చేయి ఛిద్రం!





