SGSTV NEWS online
Andhra PradeshCrime

చిట్టీల పేరుతో మోసం… రూ.5 కోట్లతో ఉడాయింపు!



రాజేంద్రనగర్: చిట్టీల పేరిట భారీ మోసం వెలుగు చూసింది. పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేసిన కుటుంబం.. రాత్రికి రాత్రే పరారైంది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లోని బుద్వేల్లో చోటు చేసుకుంది. దాదాపు రూ.5 కోట్లతో దంపతులు పరారైనట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. శనివారం రాత్రే.. ఇంటికి తాళం వేసి కుటుంబంతో పరారైనట్లు చెబుతున్నారు. నిందితుడు అశోక్ ఇంటి వద్ద బాధితులు ఆందోళనకు దిగారు. వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also read

Related posts