SGSTV NEWS online
Andhra Pradesh

కార్మికవర్గంపై దాడికి వ్యతిరేకంగా పోరాడుదాం….కంటిపోతు రమణ, ఇఫ్టు జిల్లా అధ్యక్షులు.



      నిడదవోలు యర్నగూడెం రోడ్ లోని కార్పెంటరీ వర్కర్స్ యూనియన్ కార్యాలయం నందు ఐ.యఫ్.టి.యు ఆధ్వర్యంలో నిర్వహించిన పట్టణ స్థాయి రాజకీయ తరగతులు.
    అధ్యక్షత వహించిన ఐ.యఫ్.టి.యు నిడదవోలు ఏరియా కమిటీ అధ్యక్షులు పామర్తి సత్యనారాయణ మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులు ఇటీవల కూటమి ప్రభుత్వం ప్రకటించిన సంక్షేమ పథకాలు పొందాలంటే తమ లేబర్ కార్డు లు అప్డేట్ గా ఉంచుకోవాలన్నారు.
       ఐ.యఫ్.టి.యు జిల్లా అధ్యక్షుడు కంటిపోతు రమణ మాట్లాడుతూ కార్మిక వర్గం మీద పాలకుల దాడి తీవ్రమైందనీ దాన్ని ఎదుర్కొనేందుకు కార్మిక వర్గం సంఘటితంగా పోరాడాలన్నారు.
       పై కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు కోనేటి మల్లేశ్వర రావు, కొండపల్లి నాగ శ్రీనివాసరావు, లంకాడ గణపతి, మందరపు సత్యనారాయణ, పిచ్చా సూర్య కిరణ్, మల్లిడి రామిరెడ్డి, గాలి గనిరాజు, తీపర్తి వీర్రాజు, కొమ్మోజు శేఖర్, తదితరులు నాయకత్వం వహించారు.

Also read

Related posts