ముగ్గురు బాధిత మహిళలు ఫస్ట్ ఎయిడ్ చేసిన తర్వాత కోలుకుని ఇళ్లకు వెళ్లారు. ప్రయాణికులపై పడిన ద్రావణాన్ని శాంపిల్స్ సేకరించింది ఫోరెన్సిక్ టీమ్.
విశాఖ ఐటిఐ జంక్షన్ ప్రాంతం.. వాహనాలతో మెయిన్ రోడ్డు రద్దీగా ఉంది.. ఆర్టీసీ కాంప్లెక్స్ వైపు నుంచి ఎన్ఏడి జంక్షన్ వైపు ఆర్టీసీ బస్సు ఒకటి ప్రయాణిస్తుంది. మహిళలు, పురుషులు, విద్యార్థులు ఆ బస్సులో ఉన్నారు. ఒక్కసారిగా అలజడి. ముగ్గురు మహిళలు కేకలు పెట్టారు. కళ్ళ మంటలతో ఒకసారిగా ఉక్కిరి బిక్కిరి అయ్యారు. చూస్తే పరిసర ప్రాంతాల్లో ఏదో ద్రావణం పడినట్టు కనిపించింది. వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. బాధితులను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన విశాఖపట్నంలో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేపింది.
శుక్రవారం(నవంబర్ 30) రాత్రి 9 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. కళ్ళ మంటలతో ముగ్గురు మహిళల కేకలు పెట్టడంతో.. బస్సును డ్రైవర్ ఆపారు. ప్రయాణికులను హుటాహుటీన హాస్పిటల్కు తరలించారు. మిగిలిన ప్రయాణికులు బస్సు దిగిపోయారు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సీసీ ఫుటేజ్ను పరిశీలిస్తున్నారు పోలీసులు. ఆ ద్రావణం ఎక్కడి నుంచి పడిందా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. బస్సు వెళ్లే పరిసర ప్రాంతాల్లో ఫోర్ వీలర్ లే ప్రయాణించినట్టు గుర్తించారు. ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి గిడిజాలకు వెళ్తుంది రూట్ నెంబర్ 28 బస్సులో ఈ ఘటన చోటుచేసుకుంది.
ముగ్గురు బాధిత మహిళలు ఫస్ట్ ఎయిడ్ చేసిన తర్వాత కోలుకుని ఇళ్లకు వెళ్లారు. ప్రయాణికులపై పడిన ద్రావణాన్ని శాంపిల్స్ సేకరించింది ఫోరెన్సిక్ టీమ్. ఆ ద్రావణం ఏంటని విషయం ఇంకా నిర్ధారించాల్సి ఉందని, వాటిని ల్యాబ్కు పంపుతామని అంటున్నారు పోలీసులు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని ప్రకటన విడుదల చేశారు
Also read
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- వాస్తు టిప్స్ : ఇంటిలోకి పాము రావడం శుభమా? అశుభమా?
- Garuda Purana: అంత్యక్రియల్లో ఈ కలపలనే ఎందుకు ఉపయోగిస్తారు? గరుడ పురాణం ప్రకారం వాటి విశిష్టత ఇదే
- Guru Purnima: ఆషాఢ పౌర్ణమి రోజున చేయాల్సిన పనులు.. పొరపాటున కూడా చేయకూడని పనులు ఇవే!
- అమ్మా నాన్నలపై అలిగి.. పారిపోయిన ముగ్గురు బాలికలు





