అమలాపురం : బండారులంక దంగేటివారిపాలెంలో ఓ వివాహిత ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కడలి సాయివెంకటజ్యోతి(24)కి 2021లో గ్రామానికి చెందిన శిరీష్ వివాహం జరిగింది. పిల్లలు లేకపోవడంతో భర్తతో పాటు అత్తమామలు, బంధువులు సాయివెంకటజ్యోతిని వేధించడంతో తట్టుకోలేక శనివారం ఉదయం ఇంట్లోని ఫ్యాన్కు ఆమె ఉరేసుకున్నారు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అమలాపురం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. మృతురాలి తల్లి సత్యవతి ఫిర్యాదు మేరకు అమలాపురం తాలూకా పోలీసులు కేసు నమోదు చేశారు.
పెండ్లి కుమారుడి అదృశ్యంపై కేసు
ఉప్పలగుప్తం: వివాహమైన మూడో రోజునే పెండ్లి కుమారుడు అదృశ్యమైన ఘటనపై ఉప్పలగుప్తం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఎస్సై కె. జానీబాషా తెలిపిన వివరాల ప్రకారం.. ఉప్పలగుప్తం మండలం గోపవరం గ్రామ యువకుడికి ఏప్రిల్ 29న ఐ.పోలవరం మండలానికి చెందిన ఓ యువతితో వివాహం జరిగింది. మే 1న ఉదయం నుంచి తన కుమారుడు కనిపించడం లేదంటూ తండ్రి పోలీసులకు ఫిర్యాదు. చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శనివారం తెలిపారు.
Also read
- స్మార్ట్ఫోన్ కొనడం ప్రాణాల మీదకు తెచ్చింది.. ఈఎంఐ భయంతో యువకుడి ఆత్మహత్య!
- ఉస్మానియా డెంటల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. ప్రిన్సిపల్ సంచలన నిర్ణయం!
- ఊరు మారిన మారని బుద్ధి.. మరోసారి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన గ్రామ కార్యదర్శి!
- ఫేస్బుక్లో చాటింగ్.. అడిగినంత డబ్బు ఇచ్చాడు.. తీరా కలవడానికి వెళ్తే ఊహించని సీన్..
- సిగరెట్లే అతని టార్గెట్.. వరుస చోరీలతో పోలీసులకు దొంగ సవాల్





