నా బంగారు నగలు నాకు ఇవ్వాలంటూ.. భర్తను స్తంభానికి కట్టివేసింది ఓ భార్య. బంగారం ఇస్తావా ఇవ్వవా అని నిలదీయడంతో అక్కడ ఉన్న వారంతా ఆశ్చర్యానికి గురయ్యారు. ఇందుకు సంబంధించిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం గాజులపల్లి గ్రామానికి చెందిన కావ్య అనే మహిళ.. నాలుగు సంవత్సరాల కిందట దౌల్తాబాద్ మండల పరిధిలోని లింగరాజుపల్లి గ్రామానికి చెందిన కరుణాకర్ తో వివాహం జరిగింది. కొన్ని రోజులు సాఫీగా సాగిన వీరి సంసారం.. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలతో పెద్దల సమక్షంలో విడాకుల ఒప్పందం కుదుర్చుకున్నారు. అందులో భాగంగా కావ్యకు రావలసిన బంగారు ఆభరణాలు, నగదు తిరిగి ఇచ్చేందుకు భర్త కరుణాకర్ అంగీకరించాడు. కానీ కరుణాకర్ బంగారు ఆభరణాలు ఇవ్వకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు.
ఈ నేపథ్యంలో, నాలుగు సంవత్సరాల తర్వాత కరుణాకర్ గాజులపల్లిలోని ఓ ఫంక్షన్ కు హాజరయ్యాడు. కరుణాకర్ను గమనించిన కావ్య అందరి ముందు నిలదీసింది. దీంతో సరియైన సమాధానం రాకపోవడంతో అతన్ని తాళ్లతో బంధించి, స్తంభానికి కట్టేసింది. తనకు ఇవ్వాల్సిన బంగారం ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో విషయం పోలీసులకు చేరింది. దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, ఇరువురిని సముదాయించి చెప్పడంతో గొడవ సద్దుమణిగింది. మాజీ భర్తను కట్టేసిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది
Also read
- చాక్లెట్ కొనిస్తానని చెప్పి నాలుగేళ్ల చిన్నారిని..
- Andhra: నోటి దురుసు ఎంతపనిచేసింది.. భార్య వెళ్లిందని అలా మాట్లాడితేనే కొట్టి చంపేస్తారా..?
- హీటర్ ప్రాణం తీసింది..
- ఇంత కరువు పట్టి ఉన్నారేంట్రా.. స్థంభాలకున్న కరెంట్ తీగలనూ వదల్లేదు..
- ఐ.యఫ్.టి.యు అధ్యక్ష, కార్యదర్శులు గా పామర్తి సత్య, గెడ్డం రవీంద్ర లు.





