కామారెడ్డి జిల్లా: ఏకంగా అధికార పార్టీ ఎమ్మెల్యేనే టార్గెట్ చేసి బ్లాక్ మెయిలింగ్కు పాల్పడిన ఓ యూట్యూబర్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. కామారెడ్డి జిల్లా జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంత రావును బెదిరించిన కేసులో యూట్యూబర్ శ్యామ్ను రాజేంద్రనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో హాజరుపర్చారు. ఎమ్మెల్యేకు సంబంధించిన వీడియోలు ఉన్నాయంటూ శ్యామ్ బ్లాక్మెయిలింగ్కు దిగాడు.
సోషల్ మీడియాలో పోస్ట్ చేయకుండా ఉండాలంటే భారీగా డబ్బులు ఇవ్వాలంటూ శ్యామ్ డిమాండ్ చేశాడు. దీంతో తన నుంచి రూ.5 కోట్లు డిమాండ్ చేశాడంటూ ఎమ్మెల్యే లక్ష్మీకాంత రావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు శ్యామ్ని అదుపులోకి తీసుకున్నారు. డబ్బుల కోసం బెదిరించిన వ్యవహారంలో శ్యామ్తో పాటు మరో మహిళపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.
Also read
- కాళ్లు.. చేతులు కట్టేసి.. గొంతుకు తాడుతో బిగించి చంపేశారు
- మామిడికాయ పచ్చడి విషయంలో గొడవ
- ఆత్మహత్య వెనుక.. ప్రొఫెసర్ తో ప్రేమ
- చిన్నారికి అప్పుడే నూరేళ్లు నిండాయా.. అంత్యక్రియలకు వచ్చి..
- మినీ మహానాడు లో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలి…..