వైకాపా కార్యకర్త దాడిలో తీవ్రంగా గాయపడిన యువకుడు చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు.
దుగ్గిరాల: గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. దుగ్గిరాల మండలం తుమ్మపూడిలో తెదేపా కార్యకర్త ఖాసీంపై అదే గ్రామానికి చెందిన వైకాపా కార్యకర్త క్రికెట్ బ్యాట్తో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన ఖాసీంను కుటుంబ సభ్యులు మంగళగిరిలోని ఎన్నారై ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. తెలుగుదేశం పార్టీ గెలిచిందన్న సంతోషంతో సంబరాలకు సిద్ధమవుతున్న ఖాసీంపై కమల్ బ్యాట్తో దాడి చేశాడని మృతుని బంధువులు తెలిపారు. వైకాపా ఓటమిని తట్టుకోలేక నిందితుడు ఈ దారుణానికి పాల్పడ్డాడని బాధితులు వెల్లడించారు. కమల్పై కఠిన చర్యలు తీసుకోవాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని బాధితులు హెచ్చరించారు.
Also read
- Telangana: ఇంతకాలం టైంపాస్కి లవ్ చేశావా..? అమ్మాయి చెప్పిన ఆ ఒక్క మాటతో..
- మామిళ్ళగూడెం మృత్యుఘోష.. నిన్న తండ్రి, కూతురు.. నేడు తల్లి.. ఆ ఇంట్లో ఏం జరిగింది?
- స్క్రీన్ ప్లే అదిరింది కానీ.. సీన్ మార్చేసిన క్యూఆర్ కోడ్! చండ్రుపట్ల కాలువ మృతదేహం కేసులో దిమ్మతిరిగే ట్విస్ట్!
- నకిలీ రికమండేషన్ లెటర్స్ కలకలం.. తిరుమలలో అడ్డంగా దొరికిపోయిన మోసగాడు..!
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?





