విజయవాడలో శుక్రవారం రాత్రి ఓ ప్రైవేటు కాలేజీ ప్రిన్సిపాల్ కిడ్నాప్ కలకలం రేపింది. శాతవాహన కళాశాల ప్రిన్సిపాల్ వంకాలపాటి శ్రీనివాస్ను కొందరు గుర్తుతెలియని దుండగులు కిడ్నాప్ చేశారు. బందర్ రోడ్డులోని డి అడ్రస్ మాల్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.
సీసీ టీవి వీడియో….
Big Breaking: విజయవాడలో శుక్రవారం రాత్రి ఓ ప్రైవేటు కాలేజీ ప్రిన్సిపాల్ కిడ్నాప్ కలకలం రేపింది. శాతవాహన కళాశాల ప్రిన్సిపాల్ వంకాలపాటి శ్రీనివాస్ను కొందరు గుర్తుతెలియని దుండగులు కిడ్నాప్ చేశారు. బందర్ రోడ్డులోని డి అడ్రస్ మాల్ వద్ద కాలేజీ ప్రిన్సిపాల్ శ్రీనివాస్ ను కిడ్నాప్ చేసి కారులో తీసుకెళ్లారు. బాధితుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. కాగా గత కొంతకాలంగా వందల కోట్ల విలువైన కాలేజీ ఆస్తిపై వివాదం కొనసాగుతోంది. ఈ క్రమంలో ప్రిన్సిపాల్ కిడ్నాప్ కావడం పలు అనుమానాలకు తావిస్తోంది.
శుక్రవారం రాత్రి డీ అడ్రస్ మాల్ కు వెళ్లిన శ్రీనివాస్ తిరిగి వచ్చి తన కారు ఎక్కుతున్న క్రమంలో కిడ్నాపర్లు ఆయనను కారునుంచి దింపి తమతో తీసుకెళ్లారు. ఆయనను బలవంతంగా తీసుకెళ్లినట్లు గుర్తించిన సెక్యూరిటీ గార్డు విషయాన్ని డీ అడ్రస్ మాల్ యజమాని శ్రీకాంత్కు తెలిపారు. అప్రమత్తమైన ఆయన కృష్ణలంక పోలీసులకు సీపీకి సమాచారం అందించారు.
మరోవైపు కుటుంబసభ్యులు సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్కు వెళ్లి శ్రీనివాస్ కిడ్నాప్ పై ఫిర్యాదు చేశారు. విజయవాడ సీపీ కృష్ణలంక పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు సీసీ ఫుటేజ్ పరిశీలించారు. శ్రీనివాస్ను కిడ్నాప్ చేసిన తీసుకెళ్లినట్లు సీసీ కెమెరాలో రికార్డైంది. అయితే శ్రీనివాస్ గాంధీనగర్ కి చెందిన వ్యక్తి కావడంతో అనంతరం కృష్ణలంక పోలీసులు సత్యనారాయణపురం పోలీసులకు కేసు ట్రాన్స్ఫర్ చేశారు.
ప్రిన్సిపాల్ కిడ్నాప్ కథ సుఖాంతం
విజయవాడలో నిన్న సాయంత్రం కలకలం రేపిన శాతావాహన కాలేజీ ప్రిన్సిపాల్ వంకాయలపాటి శ్రీనివాస్ కథ సుఖాంతమైంది. సాయంత్రం ఆరుగంటలకు శ్రీనివాస్ను కిడ్నాప్ చేసిన దుండగులు అర్థరాత్రి 12 గంటల ప్రాంతంలో వదిలేశారు. నిన్న రాత్రి డీ అడ్రస్ మాల్కు వెళ్లిన సందర్భంలో శ్రీనివాస్ ను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి కారులో తీసుకెళ్లారు. దీంతో మాల్ యాజమానితో పాటు ఆయన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. పోలీసులకు సమాచారం చేరిందని తెలియడంతో కిడ్నాపర్లు ఆయనను వదిలేశారు. అయితే శాతవాహన కళాశాల స్థల వివాదం నేపథ్యంలోనే ఈ కిడ్నాప్ జరిగినట్లు తెలుస్తోంది. 2009 ఈ స్థలం వివాదంలో ఉంది. బోయపాటి, కామేశ్వరరావు మధ్య దీనిపై కోర్టులో కేసు నడుస్తోంది.కోర్టు లో కేసు ఇప్పుడు లిస్టింగ్ అయ్యింది. పోలీసుల భయంతో కిడ్నాపర్లు ఆయనను వదిలిపెట్టారు.
Also read
- కాళ్లు, చేతులు కట్టేసి..కడపలో వ్యక్తి దారుణ హత్య
- AP Crime: ఏపీలో రేషన్ మాఫియా అక్రమాల బాగోతం.. ప్రారంభమైన మరుసటి రోజే దందాలు
- AP News: ఏపీలో పవిత్రతకు విఘాతం.. గంగమ్మ జాతరలో యువకుల ఆకతాయి చేష్టలు
- Adilabad : ఓరెయ్ దరిద్రుడా.. భార్యతో బలవంతంగా గర్భస్రావం మాత్రలు మింగించి
- తిరుమలలో చిరుత సంచారం.. ఆలయంపై విమానం చక్కర్లు..వీడియో.. అధికారులేమంటున్నారంటే