బైక్ అదుపుతప్పి రోడ్డుపక్కనే ఉన్న స్టీల్ రెయిలింగ్ను ఢీ కొన్న ఘటనలో మూడేళ్ల బాబు మృతి చెందగా తల్లికి తీవ్రగాయలయ్యాయి. ఒక్కగానొక్క కొడుకు కళ్లముందే కనుమూయడంతో ఆ తల్లిదండ్రుల శోకం అందరినీ కలిచివేసింది. కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి.
Road Accident: బైక్ అదుపుతప్పి రోడ్డుపక్కనే ఉన్న స్టీల్ రెయిలింగ్ను ఢీ కొన్న ఘటనలో మూడేళ్ల బాబు మృతి చెందగా తల్లికి తీవ్రగాయలయ్యాయి. ఒక్కగానొక్క కొడుకు కళ్లముందే కనుమూయడంతో ఆ తల్లిదండ్రుల శోకం అందరినీ కలిచివేసింది. నర్సాపూర్ ఎస్సై లింగం కథనం ప్రకారం..
మెదక్ జిల్లా చిలప్చెడ్ మండలం చండూరుకు చెందిన సంగారెడ్డి రామిరెడ్డి కుత్బుల్లాపూర్ నియోజకవర్గం మల్లంపేటలో స్థిరపడ్డాడు. ఆయనకు మూడు సంవత్సరాల కుమారుడు ధ్రువాన్షురెడ్డి ఉన్నాడు. వేసవిసెలవులు కావడంతో చండూరులోని తాత ఇంటివద్ద ఉన్నాడు. అయితే అతన్ని ఇంటికి తీసుకురావడానికి రామిరెడ్డి తన భార్య మాధవితో కలిసి ద్విచక్రవాహనం పై చండూరుకు వెళ్లాడు. ధ్రువాన్షురెడ్డిని తీసుకుని రామిరెడ్డి, మాధవి ఇద్దరూ తిరిగి మల్లంపేటకు బయలుదేరారు.
మార్గ మధ్యలో నర్సాపూర్ శివారుకు వచ్చే సరికి ద్విచక్రవాహనం అదుపుతప్పింది. దీంతో జాతీయ రహదారి పక్కనే ఉన్న స్టీల్ రెయిలింగ్ను ఢీకొంది. ముందు కూర్చున్న ధ్రువాన్షురెడ్డి తలకు బలమైన గాయమై అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. వెనుక కూర్చున్న మాధవికి తీవ్రగాయాలయ్యాయి. మాధవికి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స చేయించి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించారు. తల్లిదండ్రుల కళ్లెదుటే ఒక్కగానొక్క కుమారుడు దుర్మరణం చెందడంతో వారు గుండెలవిసేలా విలపించారు. మూడేళ్ల చిన్నారిని రక్తపు మడుగులో చూసిన కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి.
Also read
- Air India: అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో సైబర్ దాడి కోణం..? ఆపరేటింగ్ సిస్టమ్ హ్యాక్ చేసి..
- బ్లాక్ బాక్స్ ఏ రంగులో ఉంటుంది..? విమానంలో ఏ భాగంలో ఉంటుంది..? ఇది గ్రూప్1 ప్రిలిమ్స్ ప్రశ్న
- తొలిసారి భారత్లో మొదలైన బ్లాక్బాక్స్ డీకోడింగ్ ప్రక్రియ.. ఏ ఒక్క క్లూని వదలని దర్యాప్తు సంస్థలు!
- విమాన శిథిలాల్లో దొరికిన కీలక క్లూ.. DVRను విశ్లేషించనున్న FSL బృందం
- ఎయిరిండియా విమానం కూలిపోవడానికి కారణాలివేనా.? షాకింగ్ విషయాలు చెప్పిన అమెరికా నిపుణులు