వైసీపీ నాయకుడు ఒకరు వ్యభిచారం చేస్తూ దొరికిపోయిన సంఘటన విజయవాడ నడిబొడ్డున జరిగింది. మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి సన్నిహితుడుగా పేరు పొందిన శంకర నాయక్ అనే వైసీపీ నాయకుడు పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోవడం రాజకీయ వర్గాలలో సంచలనం గా మారింది. వైసీపీ నాయకుడు శంకర నాయక్ విజయవాడలో మసాజ్ సెంటర్ లో వ్యభిచారం చేస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. జగన్ రెడ్డి సీఎంగా పని చేసినప్పుడు శంకర్ నాయక్ ను రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యుడిగా నియమించారు. గతంలో ఇలా జగన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు పదవులు పొందిన చాలా మంది వ్యభిచారం చేస్తూ ఇతర నేరాల్లో పట్టబడ్డారు. తాజాగా శంకర్ నాయక్ ఇలా వ్యభిచారం కేసులో పట్టుపడటంతో ఇదా రాజకీయం అంటూ పలువురు ఆశ్చర్యపోతున్నారు. రాజకీయ నాయకుల పేరుతో సంఘ విద్రోహశక్తులు చేస్తున్న ఇలాంటి నేరాలు మరింత ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. శంకర నాయక్ స్పా సెంటర్లో పోలీసులకు అడ్డంగా దొరికిపోవడం తాజా ఉదాహరణగా చెబుతున్నారు. విజయవాడలో మసాజ్ సెంటర్ లో ఉత్తరాది యువతితో వ్యభిచారం చేస్తున్న సమయంలో పోలీసులు రావడంతో అత్యంత రహస్య ప్రదేశంలో దాక్కున్న వైసీపీ నాయకుడు శంకర్ ను అతి కష్టం మీద పోలీసులు పట్టుకున్నారు.
Also read
- మరణం తర్వాత ఆత్మ ఎక్కడికి వెళుతుంది? గరుడ పురాణం చెప్పిన ఆశ్చర్యకర నిజాలు
- పుట్టినరోజు ఎలా జరుపుకోవాలి
- Shiv Temple: గర్భగుడిలో లింగం, నందీ లేదు.. ధ్వజస్తంభమూ లేదు.. అయినా భక్తులతో కిటకిటలాడే ఈ శివాలయం ఎక్కడుందో తెలుసా?
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- Tuni: తుని బాలిక మిస్సింగ్ కేసులో కీలక అప్ డేట్.. చిన్న పిల్ల ఏడుపు వినిపించిదని..




