పుణె: మహారాష్ట్రలోని పుణె వద్ద పెళ్లాడబోయే యువతి ఫొటోలు తీస్తూ యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ (26) లోయలో పడి మృతిచెందినట్టుగా నమోదైన కేసు పెద్ద మలుపు తిరిగింది. అది ప్రమాదం కాదని, ప్రణాళిక ప్రకారం చేసిన హత్యగా పోలీసులు నిర్ధారించారు. నిందితులైన సియా గోయల్ (20)ను, ఆమె ప్రియుడు చేతన్ చౌదరి (22)ని మంగళవారం అరెస్టు చేశారు. కేతన్ ఈ నెల 18న చారిత్రక లోహగఢ్ కోట వద్ద 400 అడుగుల లోతు లోయలో పడి ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. తన పుట్టినరోజు సందర్భంగా ట్రెక్కింగుకు వచ్చామని, కేతన్ ఫొటోలు తీస్తూ హోరుగాలికి పట్టుతప్పి లోయలో పడిపోయాడని సియా గోయల్ లోనావాలా గ్రామీణ పోలీసులకు తెలిపింది. తదుపరి విచారణలో సియా పొంతన లేని సమాధానాలు చెప్పడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. ఆమె మొబైల్ డేటా పరిశీలించి లోతుగా దర్యాప్తు చేయగా.. సియా, ఆమె ప్రియుడు చేతన్ కలిసి కేతనను లోయలోకి తోసి, ప్రమాదంగా చిత్రీకరించారని తేలింది.
Also read
- Hyderabad: అతన్ని గుడ్డిగా నమ్మింది.. హోటల్కు వెళ్లింది.. కట్చేస్తే.. అసలు మ్యాటర్ తెలిసి..
- అగస్త్య మహర్షి ప్రతిష్ఠించిన శివలింగం- ప్రొద్దుటూరులో అరుదైన నవగ్రహ మండపం విశేషాలివే!
- తల్లి మృతిని తట్టుకోలేక.. భార్యను చంపి భర్త ఆత్మహత్య
- లాయర్ అయితే నాకేంటి.. చంపకుండా ఇక్కడి నుంచి వెళ్లను!’
- రోడ్డు ప్రమాదంలో ట్రాఫిక్ డీసీపీ కుమార్తె మృతి




