అమీన్పూర్లో దారుణం చోటుచేసుకుంది. మహేశ్వరి అనే ఓ యువతి గ్రౌండ్ లో కారు నేర్చుకుంటూ నిర్లక్ష్యంగా ఇద్దరు పిల్లల పైకి ఎక్కించేసింది. ఈ ఘటనలో పదేళ్ల మణివర్మ అనే బాలుడు స్పాట్లోనే చనిపోగా ఏకవాణి అనే పద్నాలుగేళ్ల పాప ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో దారుణం చోటుచేసుకుంది. మహేశ్వరి అనే ఓ యువతి గ్రౌండ్ లో కారు నేర్చుకుంటూ నిర్లక్ష్యంగా ఇద్దరు పిల్లల పైకి ఎక్కించేసింది. అదుపు తప్పడంతో పిల్లల పైకి కారు వెళ్లింది. ఈ ఘటనలో పదేళ్ల మణివర్మ అనే బాలుడు స్పాట్లోనే చనిపోగా ఏకవాణి అనే పద్నాలుగేళ్ల పాప ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. అక్కాతమ్ముడు మైదానంలో ఆడుకుంటుండగా ఈ ప్రమాదం జరిగింది. కారు నడిపిన యువతిని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. పిల్లాడి తండ్రి శేఖర్ ఫిర్యాదుతో యువతిపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులు మహేశ్వరి, రవిశేఖర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదానికి కారణమైన కారును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Also read
- బ్రహ్మ ముహూర్తమే కాదు.. సాయంత్రం ఈ గంటలో దీపం వెలిగిస్తే లక్ష్మీ కటాక్షం, రాజయోగం కలుగుతాయట!
- నిజ జ్యేష్ఠ మాసం మొదలు.. ఈ పూజలు, దానాలు చేస్తే ఐశ్వర్యం, ఆరోగ్యం మీ సొంతమట!
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- పాము కాటు.. తండ్రి పగ.. కొడుకును చంపిన త్రాచును వేటాడి చంపాడు.. ఎక్కడంటే..
- ఏంటక్కా మరీ ఇలా ఉన్నావ్.. స్కెచ్ వేసింది.. సైలెంట్గా సెలైన్తో పనికానిచ్చేసింది





