విద్యాబుద్ధులు నేర్పించాల్సిన గురువు వికృత చేష్టలకు పాల్పడ్డాడు. అభం శుభం తెలియని చిన్నారుల పట్ల వంకరబుద్ధి ప్రదర్శించాడు.
కంకిపాడు , : విద్యాబుద్ధులు నేర్పించాల్సిన గురువు వికృత చేష్టలకు పాల్పడ్డాడు. అభం శుభం తెలియని చిన్నారుల పట్ల వంకరబుద్ధి ప్రదర్శించాడు. కృష్ణా జిల్లా కంకిపాడు మండలంలోని ఈడుపుగల్లు గాంధీనగర్ ఎంపీపీ మోడల్ పాఠశాలలో మండవ శ్రీనివాస్(61) ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. కొన్నాళ్లుగా రెండో తరగతి నుంచి ఐదో తరగతి చదువుతున్న విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. ఓ బాధిత విద్యార్థిని ఆదివారం ఈ విషయాన్ని తన తండ్రికి చెప్పింది. దీంతో ఆయన మిగిలిన బాధితుల తల్లిదండ్రులతో మాట్లాడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పూర్తి వివరాలు సేకరించి, నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు సీఐ మురళీకృష్ణ తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రీయ ఉపాధ్యాయ సంఘం(ఎస్టీయూ) జిల్లా గౌరవాధ్యక్షుడిగా ఉన్న శ్రీనివాస్ మరో ఏడాదిలో ఉద్యోగ విరమణ చేయనున్నాడు. ఉత్తమ ఉపాధ్యాయుడిగా పురస్కారాలూ అందుకున్నాడు. ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేస్తూ డీఈవో ఉత్తర్వులనిచ్చారు.
Also read
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- లలితా సహస్రనామం పుట్టిన మహిమ గల క్షేత్రం ఎక్కడ ఉంది తెలుసా?
- యామాలోక ప్రయాణంలో ఆత్మ చేరుకునే ఆరో పట్టణం క్రౌంచపురం – ఆత్మ ప్రయాణం అత్యంత కఠినం, వేదనాభరితమట.
- ఆ.. ఇంట్లో ఏమైందో?
- దంపతుల మధ్య గొడవ.. కొడవలితో దాడి చేసిన భార్య.. భర్త మృతి





