కాకినాడ నగరంలోని రెండో డివిజన్ చర్చికాంత నగర్లో మంగళవారం రాత్రి వైకాపా నాయకులు వీరంగం సృష్టించారు.
కాకినాడ: కాకినాడ నగరంలోని రెండో డివిజన్ చర్చికాంత నగర్ లో మంగళవారం రాత్రి వైకాపా నాయకులు వీరంగం సృష్టించారు. జనసేన, భాజపా నాయకులపై దాడికి దిగారు. బాధితుల ఫిర్యాదు మేరకు సర్పవరం పోలీసులు ఆరుగురిపై కేసు నమోదు చేశారు.. కాకినాడ గ్రామీణ జడ్పీటీసీ నురుకుర్తి రామక్రిష్ణ, గ్రామీణ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు సోదరుడు, సినీ డైరెక్టర్ కళ్యాణ కృష్ణ, వైకాపా నాయకుడు కడియాల చిన్నబాబు, తిమ్మాపురం సర్పంచి, జేఎన్టీయూకే ఈసీ సభ్యుడు బెజవాడ సత్యనారాయణ, మేమం సర్పంచి రాన్దేవ్ చిన్న.. మరొకరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సర్పవరం ఎస్ఐ తెలిపారు.
Also read
- మానవత్వం మరిచిన ఇంటి యజమాని.. మృతదేహాలను ఇంట్లోకి రానివ్వకుండా గేటుకు తాళం
- సాయికృష్ణ మిస్సింగ్ కేసులో కీలక పరిణామం.. సీఐ నాగరాజు అరెస్ట్!
- అమానవీయం.. మృతదేహాలు తీసుకురాకుండా అద్దె ఇంటికి తాళం
- రోడ్డు దాటుతుండగా విషాదం..!
- ఆర్థిక ఇబ్బందులతో వివాహిత ఆత్మహత్య





