దేవాలయ హుండీలో సొమ్ము కాజేయడానికి ప్రయత్నించిన ఒక దొంగ చెయ్యి అందులో ఇరుక్కుపోవడంతో 12గంటల పాటు నరకయాతన అనుభవించాడు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండలంలోని రామేశ్వర్ పల్లి గ్రామ శివారులో గల మాసుపల్లి పోచమ్మ ఆలయంలో చోటుచేసుకుంది. ఆలయంలో పనిచేసే సురేష్ రాత్రి 10 గంటల ప్రాంతంలో హుండీ పైభాగాన్ని ధ్వంసం చేశాడు.
అందులో డబ్బు తీసేందుకు హుండీ లోపల చేయ్యి పెట్టాడు. అయితే సురేష్ చేయ్యి హుండీలోనే ఇరుక్కుపోయింది.దీంతో సుమారు 12 గంటల పాటు సురేష్ నరకయాతన అనుభవించాడు. ఉదయం దేవాలయానికి వచ్చిన భక్తులు గమనించి గ్రామస్తులకు సమాచారం అందించారు. గ్రామస్తులు వచ్చి పోలీసుల సమక్షంలో గ్యాస్ కట్టర్తో సురేష్ చేతిని హుండీలోంచి తొలగించారు. అనంతరం దొంగతనానికి ప్రయత్నించిన వ్యక్తిని స్థానిక భిక్కనూర్ పోలీసులకు అప్పగించారు
Also read
- పూజలు, శుభకార్యాల్లో నల్లని దుస్తులు ఎందుకు ధరించకూడదు? దీని వెనుక అసలు కారణం తెలుసా?
- Nirjala Ekadashi: నిర్జల ఏకాదశి.. తులసితో ఈ చిన్న పరిహారాలు చేస్తే ధనలక్ష్మి కటాక్షం లభిస్తుందా?
- పౌర్ణమి రోజే ఆ గ్రహాల కలయిక.. ఇది ఎవరికి వరమో తెలుసా?
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- Basara Temple: బాసర అమ్మవారి ఆలయంలో భారీ చోరీ.. సీసీ కెమెరాలకు వస్త్రాలు కప్పి కిరీటం, హుండీ మాయం





