తూర్పుగోదావరి: తూర్పుగోదావరి జిల్లాలోని మండపేట మండలంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ద్వారపూడి శివారు వేములపల్లిలో ప్రేమించి పెళ్లి చేసుకున్న సంధ్య భర్త దారుణ హత్యకు గురయ్యాడు. కులాంతర వివాహం చేసుకున్న కోపంతో యువతి కుటుంబ సభ్యులు ఆమె భర్తను తీవ్రంగా కొట్టి హత్య చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. జెడ్ మేడపాడకు చెందిన సంధ్య డిప్యూటీ తహసీల్దార్గా విధులు నిర్వహిస్తోంది. అయితే, సంధ్య.. వేములపల్లికి చెందిన బట్టల వ్యాపారి సూర్య ప్రకాష్ రావును ప్రేమించింది. ఈ క్రమంలో వీరిద్దరూ అన్నవరంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. కాగా, పెళ్లి అయిన కొన్ని గంటలకే అర్ధరాత్రి వేములపల్లిలో సూర్య ప్రకాష్ రావుపై సంధ్య అన్నదమ్ములు విచక్షణ రహితంగా దాడి చేశారు.
తమ చెల్లెలు సంధ్య కులాంతర వివాహం చేసుకున్న కారణంగా కోపంతో సూర్య ప్రకాష్ను రాళ్లతో కొట్టి చంపారు. రాళ్ల దాడి కారణంగా సూర్య ప్రకాష్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.
Also read
- ఆదివారం తులసి మొక్కకు నీరు పోయకూడదని ఎందుకు అంటారు? నిజం తెలుసుకోండి!
- Astro Secrets: మీ రాశిని శాసించే ఆ జంతువు ఏంటో మీకు తెలుసా?.. జ్యోతిష్య శాస్త్రంలో దాగి ఉన్న ఆసక్తికరమైన రహస్యాలివే!
- Weekly Horoscope: వారికి అదృష్టం కలిసి రానుంది..! 12 రాశులకు వారఫలాలు
- నువ్వేం మనిషి అంజయ్య.. అత్తగారు బైక్ కొనిపెట్టలేదని.. భార్యను చంపి..
- రైల్వే స్టేషన్కు వెళ్తుండగా విరుచుకుపడ్డ మృత్యువు..భార్య, కొడుకు కళ్లెదుటే భర్త దుర్మరణం! ఏం జరిగిందో చూస్తే..





