అనంతపురం నగరంలో కలకలం రేపిన ఘటనలో, మద్యానికి బానిసైన కొడుకు వేధింపులు భరించలేక తల్లి అతడిపై దాడి చేసిన ఘటన విషాదానికి దారితీసింది. పోలీసుల వివరాల ప్రకారం, సురేంద్ర అనే యువకుడు మద్యం కోసం తరచూ డబ్బులు డిమాండ్ చేస్తూ తల్లి సునీతను మానసికంగా వేధించేవాడని తెలుస్తోంది
అనంతపురం నగరంలో ఒళ్లు గగుర్పొడిచే దారుణ ఘటన వెలుగుచూసింది. కొడుకు వేధింపులు భరించలేక కన్నతల్లే కత్తెరతో దారుణంగా పొడిచి హత్య చేయడం కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనంతపురం నగరానికి చెందిన సురేంద్ర (28) అనే యువకుడు గత కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. జులాయిగా తిరుగుతూ, మద్యం తాగడం కోసం డబ్బులు కావాలంటూ నిత్యం తల్లి సునీతను వేధించేవాడు. రోజురోజుకూ సురేంద్ర పెట్టే చిత్రహింసలు, మానసిక వేధింపులు ఎక్కువయ్యాయి.
ఎప్పటిలాగే నిన్న కూడా కొడుకు గొడవ పడటంతో తీవ్ర ఆగ్రహానికి లోనైంది. విసిగిపోయిన తల్లి సునీత.. ఇంట్లో ఉన్న కత్తెరను తీసుకుని సురేంద్ర గొంతులో బలంగా పొడవడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న అనంతపురం మూడో పట్టణ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పరిశీలించి, క్లూస్ టీమ్ ద్వారా ఆధారాలు సేకరిస్తున్నారు.
ఈ ఘాతుకానికి పాల్పడిన తల్లి సునీతపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతోపాటు.. పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. వేధింపుల వల్లే ఈ హత్య జరిగిందా లేక దీని వెనుక ఇంకా ఏవైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. కాగా.. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.
Also read
- Telangana: ఆధార్ కార్డు అప్డేట్ చేస్తామంటూ.. ఇంట్లో మొత్తం దోచేశారు..
- ప్రముఖులతో ఫొటోలు.. చేతిలో ఫేక్ ఐడీ.. డీఐజీ అంటూ భార్యాభర్తల లక్షల దందా!
- అన్నం పెట్టిన బ్యాంకుకే కన్నం.. రూ. 90 లక్షల బంగారం మాయం! ఎవరో తెలిసి షాక్!
- డేటింగ్ యాప్లో పరిచయం..ఎంగేజ్మెంట్తో అసలు గుట్టు రట్టు! కట్చేస్తే పోలీసుల రంగప్రవేశం
- వారఫలాలు: ఆ రాశుల వారికి ఇక తిరుగులేదు.. ఏ పనిచేసినా సక్సెసే.. ఇందులో మీ రాశి ఉందా..?






బీజేపీ అంటే బాబు, జగన్, పవన్.. తెలంగాణ సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు..