పొలంలో వరి నాట్లు వేసేందుకు వెళ్లిన ఆ కూలీలు సాయంత్రం పనులు ముగించుకుని తిరిగి పయనమయ్యారు.

బల్లార్ష, : పొలంలో వరి నాట్లు వేసేందుకు వెళ్లిన ఆ కూలీలు సాయంత్రం పనులు ముగించుకుని తిరిగి పయనమయ్యారు. కొన్ని నిమిషాల్లో ఇళ్లకు చేరాల్సిన నలుగురిని విద్యుత్ తీగలు మృత్యుపాశాలై కబళించాయి. మహారాష్ట్రలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. చంద్రపుర్ జిల్లా బ్రహ్మపురి తాలూకా గణేశ్పుర్ గ్రామానికి చెందిన ప్రకాశ్ రవూత్(65), యువరాజ్ డొంగరే(43), నానాజీ రవూత్(55), చిచ్కీడా గ్రామానికి చెందిన పుండలీక్ మాన్కర్(65) కూలి పనులు చేస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. బుధవారం ఉదయం గణేశ పుర్ శివారులోని ఓ రైతు పొలంలో వరినాట్లు వేసిన ఆ కూలీలు పనులు ముగించుకుని ఇళ్లకు బయలుదేరారు. పొలం మీదుగా వెళ్తున్న 11 కేవీ విద్యుత్తు లైన్ తీగలు అదే సమయంలో ప్రమాదవశాత్తు తెగి కిందపడిపోయాయి. ఆ తీగలు తగలడంతో నలుగురు కూలీలు అక్కడికక్కడే మృతిచెందారు.
Also read
- సూర్య గోచారం.. 12 రాశులపై దీని ప్రభావం ఎలా ఉండనున్నదంటే?
- June Amavasya 2026: అమావాస్య నుంచి వీరికి మహర్దశ..! ఇందులో మీ రాశి ఉందా..?
- చెన్నూరు SBI గోల్డ్ చోరీ కేసు సుఖాంతం.. ఎట్టకేలకు బంగారం తిరిగి అందజేసిన బ్యాంక్
- రాత్రిళ్లు ఇళ్లను టార్గెట్ చేస్తున్న దొంగ బాబు.. బాలెనో కారులో వచ్చి చోరీలు!
- 9 ఏళ్ల తర్వాత సంచలన తీర్పు.. కంచర్ల శ్రీను హత్య కేసులో 13 మందికి జీవిత ఖైదు!





