హైదరాబాద్, మార్చి 20: గోల్డ్ నగలు కొనేందుకు బంగారం షాపుకు వచ్చిన ఓ ప్రబుద్ధుడు చాకచక్యంగా ఉంగరాలు కొట్టేశాడు. ఇలా పలు జ్యువెల్లరీ షాపులకు నగలు కొనేందుకు వచ్చినట్లు నటించి, నింపాదిగా ఒక్కక్క ఆభరణం తీసి చూసేవాడు. ఇంతలో సేల్స్ గర్ల్ కళ్లుగప్పి చొక్కా జేబులో ఉంగరాలు దాచేశాడు. ఆనక ఏం తెలియనట్లు ఉడాయించేవాడు. ఇలా నగరంలో పలు బంగారం షాపుల్లో చోరీలు చేశాడు. అనుకోని విధంగా ఈ వ్యవహారం బయపటడటంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. దీంతో అసలు కథ బయటపడింది. పోలీసుల కథనం ప్రకారం..
ఎం సాగర్ (30) అనే వ్యక్తి బంగారం కొనడానికి ఆసక్తి ఉన్న కస్టమర్గా నటిస్తూ హైదరాబాద్లోని కుకట్పల్లిలో ఉన్న బంగారు నగర షాపులో ప్రవేశించాడు. దీంతో షాపు సిబ్బంది సెలక్షన్ కోసం అతడి ముందు కొన్ని ఆభరణాలు ఉంచారు. ఇంతలో సిబ్బంది ఇతర కస్టమర్లకు సేవలు అందించేందుకు పక్కకు వెళ్లారు. అదే అదనుగా అతగాడు గోల్డ్ ఉంగరాలను దొంగిలించి, వాటి స్థానంలో నకిలీ వాటిని పెట్టాడు. ఇలా ఒక్క షాపులో మాత్రమే కాదు జనవరి, ఫిబ్రవరి నెలల మధ్య సిటీలోని CMR జ్యువెలర్స్, మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ వంటి ప్రముఖ బంగారు దుకాణాలను సందర్శించారు. ఇలా ఎక్కడెక్కడ ఎన్నెన్ని బంగారు ఆభరణాలు మాయం చేశాడో తెలియదుగానీ.. ఇతగాడి చేతి వాటం ఓ షాపు సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అవ్వడంతో మొత్తం వ్యవహారం బయటపడింది.
Also read
- భవన నిర్మాణ కార్మికుల కు కూటమి ప్రభుత్వ వెన్నుపోటు….. గ్రీష్మ కుమార్, ఐ.యఫ్.టి.యు రాష్ట్ర కమిటీ సభ్యులు.
- ఛీ ఛీ.. నువ్వేం మనిషివిరా.. భార్యపై కోపంతో కూతురిని చంపాడు.. బైక్పై తీసుకెళ్లి..
- విశాఖలో యువతి అనుమానాస్పద మృతి… పార్టీ నుంచి లాడ్జి వరకు ఏమైంది?
- ఉద్యోగం అన్నాడు.. ప్రేయసి నుంచి రూ.18 లక్షలు కాజేశాడు.. కట్చేస్తే..
- అడుగు భూమికోసం ఇంత దారుణమా.. ఈ బుడ్డోడు ఏం చేశాడో తెలిస్తే..





