గుంటూరు సీఎంపై అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టేలా సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టిన నిందితుడిని సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. శనివారం గుంటూరులోని సీఐడీ కార్యాలయంలో సైబర్ క్రైం ఎస్పీ కేవీ శ్రీనివాస్ మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు. శ్రీసత్యసాయి జిల్లా ముదిగుబ్బ మండలం రాళ్ల అనంతపురానికి చెందిన గడ్డం శివప్రసాద్ మెడికల్ రిప్రజెంటేటివ్ పనిచేస్తున్నాడు. సీఎం చంద్రబాబుపై అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ, కుల, మతాలను రెచ్చగొట్టేలా తన ఫేస్బుక్ ఖాతాలో పోస్టు పెట్టాడు. దీనిపై గుంటూరుకు చెందిన తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కె.శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు మంగళగిరి సీఐడీ పోలీసులు శివప్రసాద్ను అరెస్టు చేశారు.
నిందితుడిని సీఐడీ పోలీసులు స్థానిక ఆరో అదనపు జూనియర్ సివిల్ కోర్టులో హాజరు పరిచారు. అతడి రిమాండ్ను తిరస్కరిస్తూ… 41ఏ నోటీసు ఇచ్చి విడుదల చేయాలని ఇన్ఛార్జి న్యాయమూర్తి ఎం. శోభారాణి ఉత్తర్వులిచ్చారు.
Also read
- ఈరోజు తొలి ఏకాదశి+శనివారం వేళ మీ ప్రేమ, కుటుంబం, కెరీర్ ఎలా ఉండబోతున్నాయి? రాశి ఫలాలు తెలుసుకోండి!
- Tholi Ekadashi: శ్రీమహావిష్ణువు యోగనిద్రలోకి వెళ్లే పవిత్ర దినం.. తొలి ఏకాదశి ఉపవాసం ఎలా ఆచరించాలి?
- విద్యా వ్యవస్థ ప్రక్షాళన కోరుతూ తరగతుల బహిష్కరణ….పి.డి.యస్. యు
- జాతకాలు మారబోతున్నాయ్.. ఆగస్టు నుంచి వారికి అదృష్టం పట్టబోతోంది!
- Vastu Tips: చాతుర్మాసంలో ఈ 5 పనులు తప్పక చేయండి.. ఇంట్లో ప్రతికూల శక్తి దూరం, లక్ష్మీ కటాక్షం మీ సొంతం!





