తాడిపత్రి: అనంతపురం జిల్లాలో ఓ నవ వధువు ఆత్మహత్య చేసుకుంది. తాడిపత్రిలోని గన్నవారిపల్లె కాలనీలోని నివాసంలో ఫ్యాన్కు ఉరివేసుకుని లక్ష్మీప్రసన్న(30) బలవన్మనరణానికి పాల్పడింది. తాడిపత్రి ప్రభుత్వ ఆస్పత్రిలో ఫిజియోథెరపిస్టుగా పనిచేస్తున్న ఆమెకు.. గత నెలలో కర్ణాటకలోని కోలార్ జిల్లా నివాసి విజయ్ కుమార్ తో వివాహం జరిగింది. పెళ్లికి ముందే ఒకసారి ఆమె డిప్రెషన్లోకి వెళ్లి ఆత్మహత్యకు యత్నించగా.. తల్లిదండ్రులు రక్షించారు. గురువారం అత్తగారింటికి వెళ్లాల్సి ఉండగా.. ఆమె ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Also read
- మరోసారి బయటపడ్డ సుకేష్ గుప్తా ‘గోల్డ్ మాల్’.. ఏకంగా నిజాం నగలకే ఎసరు..!
- ఏంటక్కా ఇది.. టిప్టాప్గా కారు దిగింది.. ఆ తర్వాత లవర్ కోసం చేయకూడని పని చేసి..
- వాడంతే.. అదో టైపు.. దొంగతనం చేస్తాడు.. ఇట్టే దొరికిపోతాడు..
- షాకింగ్.. 180 మంది అమ్మాయిల 350 వీడియోలు తీసి.! ఆ తర్వాత..
- ఇదేం ట్విస్ట్.. అత్తింటి వేధింపులు భరించలేక అల్లుడు సూసైడ్.. సెల్పీ వీడియో కలకలం





