తాడిపత్రి: అనంతపురం జిల్లాలో ఓ నవ వధువు ఆత్మహత్య చేసుకుంది. తాడిపత్రిలోని గన్నవారిపల్లె కాలనీలోని నివాసంలో ఫ్యాన్కు ఉరివేసుకుని లక్ష్మీప్రసన్న(30) బలవన్మనరణానికి పాల్పడింది. తాడిపత్రి ప్రభుత్వ ఆస్పత్రిలో ఫిజియోథెరపిస్టుగా పనిచేస్తున్న ఆమెకు.. గత నెలలో కర్ణాటకలోని కోలార్ జిల్లా నివాసి విజయ్ కుమార్ తో వివాహం జరిగింది. పెళ్లికి ముందే ఒకసారి ఆమె డిప్రెషన్లోకి వెళ్లి ఆత్మహత్యకు యత్నించగా.. తల్లిదండ్రులు రక్షించారు. గురువారం అత్తగారింటికి వెళ్లాల్సి ఉండగా.. ఆమె ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Also read
- గల్ఫ్లో తెలుగు యువతి ఆత్మహత్య..
- నా భార్య నాకు కావాలని సెల్ ఫోన్ టవర్ ఎక్కిన భర్త..
- గిరిజనులకు తప్పని డోలీ మోతలు.. గర్భిణితో రెండు కిలోమీటర్ల నడక!
- సొంతింటికే నిప్పు పెట్టాడు.. అక్కడే కుర్చీ వేసుకొని కూర్చుకున్నాడు.. ఎందుకో తెలిస్తే..
- Hyderabad: తల్లికొడుకుల మాస్టర్ ప్లాన్.. టెక్నాలజీ వాడి హత్య చేశారు.. సైలెంట్గా..





