తాడిపత్రి: అనంతపురం జిల్లాలో ఓ నవ వధువు ఆత్మహత్య చేసుకుంది. తాడిపత్రిలోని గన్నవారిపల్లె కాలనీలోని నివాసంలో ఫ్యాన్కు ఉరివేసుకుని లక్ష్మీప్రసన్న(30) బలవన్మనరణానికి పాల్పడింది. తాడిపత్రి ప్రభుత్వ ఆస్పత్రిలో ఫిజియోథెరపిస్టుగా పనిచేస్తున్న ఆమెకు.. గత నెలలో కర్ణాటకలోని కోలార్ జిల్లా నివాసి విజయ్ కుమార్ తో వివాహం జరిగింది. పెళ్లికి ముందే ఒకసారి ఆమె డిప్రెషన్లోకి వెళ్లి ఆత్మహత్యకు యత్నించగా.. తల్లిదండ్రులు రక్షించారు. గురువారం అత్తగారింటికి వెళ్లాల్సి ఉండగా.. ఆమె ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Also read
- విష్ణుమూర్తి నాభి నుంచే పద్మం ఎందుకు పుట్టింది? బ్రహ్మదేవుడి ఆవిర్భావం వెనుక అసలు రహస్యం ఇదే!
- దుర్ముహూర్తం అంటే ఏమిటి? ఈ సమయంలో శుభకార్యాలు ఎందుకు చేయరు? కారణం ఇదే!
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- ప్రియుడితో వెళ్లి.. శవమై తేలిన వివాహిత.. హత్య మిస్టరీని ఛేదించిన పోలీసులు!
- Hyderabad: డబ్బు తీసుకుంది కొడుకు.. చంపింది మాత్రం తండ్రిని.. అసలు ఏం జరిగిందంటే?





