పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారి ఐతేపల్లి సమీపంలో శనివారం వేకువజామున ముందు వెళ్తున్న ట్రక్కును వెనుక నుంచి ఓ కారు వేగంగా ఢీకొంది.
చంద్రగిరి : పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారి ఐతేపల్లి సమీపంలో శనివారం వేకువజామున ముందు వెళ్తున్న ట్రక్కును వెనుక నుంచి ఓ కారు వేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులోని రేణిగుంట మండలం ఆర్. మల్లవరం గ్రామానికి చెందిన బాలసుబ్రహ్మణ్యం కుమారుడు పాలపర్తి సందీప్(31) దుర్మరణం చెందాడు. యువకుడు అమెరికాలో ఉద్యోగం చేస్తుండగా.. కుటుంబ సభ్యుల కోరిక అక్కడ మానేసి.. బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీరుగా పనిచేస్తున్నాడు. పెళ్లిచూపులున్నాయని తల్లిదండ్రులు సమాచారం ఇవ్వడంతో బెంగళూరు నుంచి స్వగ్రామం వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఏఎస్సై సుధాకర్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Also read
- అనంత హనీట్రాప్.. రంగమ్మ అరెస్ట్, వీఆర్ కు సీఐలు..
- డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్టు
- షాపింగ్కు వెళ్లిన భర్త.. సైలెంట్గా ఫాలో అయిన భార్య.. ఆ తర్వాతే అసలు ట్విస్ట్..!
- వివాహేతర సంబంధం భర్తకు తెలిసిందని..
- రాత్రి పూట పేకాట ఆడేందుకు వెళ్లి మిస్సింగ్.. మిస్టరీగా మారిన ఘటన





