ఆదిలాబాద్, మంచిర్యాల: జిల్లాలోని కోటపల్లి మండలం
ఎసన్వాయి గ్రామంలో గుడుంబా తయారీ, విక్రయాలపై పోలీస్, ఎక్సైజ్ శాఖ సంయుక్త దాడులు జరిపారు. ఈ దాడుల్లో సరైన ధృవపత్రాలు లేని 35 వాహనాలను సీజ్ చేశారు. అయితే, గ్రామంలోని ప్రతి ఇంటిని తనిఖీ చేసిన ఎక్సైజ్ పోలీసులు.. నిలువ ఉంచబడిన సుమారు 1,000 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేసి, 30 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం 9 మందిపై కేసులు నమోదు చేశారు. గుడుంబా నిర్మూలనపై.. ఏసీపీ వెంకటేశ్వర్లు గ్రామస్తులకు అవగాహన కల్పించారు. అలాగే, ఇలాంటి కార్యకాలపాలు చట్ట విరుద్ధమని, ఇందులో పాల్గొన్నవద్దని వారికి చెప్పడంతోపాటు, గుడుంబా తయారీలో పాల్గొన్నవారిపై చట్టపరమైన కేసులు నమోదు చేస్తామని గ్రామస్తులను ఏసీబీ హెచ్చరించారు.
Also read
- పల్నాడులో హత్య.. గోవాలో జాడ..! నిందితుల కోసం పోలీసుల షాకింగ్ ఆపరేషన్!
- కూతురిపై అఘాయిత్యానికి తల్లి సపోర్ట్.. అతనితో ఆమెకి కూడా వివాహేతర బంధం! అనకాపల్లిలో ఘోరం..
- ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో ఉరేసుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య! కారణం..?
- జలుబు చేసిందని RMP డాక్టర్ దగ్గరికి వెళ్తే.. ఏకంగా ప్రాణాలే పోయాయ్!
- సిని ఫక్కీలో చేజింగ్.. చైన్ స్నాచర్లను పట్టుకున్న సరిహద్దు గ్రామస్తులు..! మహిళ సహా..





