రాజేంద్రనగర్: చిట్టీల పేరిట భారీ మోసం వెలుగు చూసింది. పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేసిన కుటుంబం.. రాత్రికి రాత్రే పరారైంది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లోని బుద్వేల్లో చోటు చేసుకుంది. దాదాపు రూ.5 కోట్లతో దంపతులు పరారైనట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. శనివారం రాత్రే.. ఇంటికి తాళం వేసి కుటుంబంతో పరారైనట్లు చెబుతున్నారు. నిందితుడు అశోక్ ఇంటి వద్ద బాధితులు ఆందోళనకు దిగారు. వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also read
- పోలీస్ స్టేషన్లో కాల్పుల కలకలం.. AK-47తో కాల్చుకుని ఎస్ఐ ఆత్మహత్యాయత్నం!
- మధ్యాహ్న భోజన పథకం కార్మికుల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి….. గ్రీష్మ కుమార్, ఐ.యఫ్టియు రాష్ట్ర కమిటీ సభ్యులు.
- Ganesh Chaturthi: గణేశుడికి ఏనుగు తల ఎలా వచ్చింది? గజాసురుడి తలనే ఎందుకు పెట్టారు.. అసలు కథ ఇదే!
- భాద్రపద మాసం.. వినాయక చవితి నుంచి మహాలయ అమావాస్య వరకు.. ఈ మాసంలోని పండగలివే!
- వినాయక చవితి వేళ అద్భుత గ్రహ యోగాలు.. ఈ రాశుల వారికి గణపతి ఆశీస్సులతో పట్టిందల్లా బంగారమే!





