తిమ్మాజిపేట, పొలం అమ్మకం విషయంలో జరుగుతున్న గొడవల కారణంగా ఓ భార్య.. భర్త గొంతు నులిమి హత్య చేసిన ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు, గ్రామస్థుల వివరాల మేరకు.. తిమ్మాజిపేట మండలం ఆవంచకు చెందిన అమ్మపల్లి యాదయ్య (57)కు భార్య అలివేలు, కుమార్తె పద్మ, అల్లుడు ఆంజనేయులుకు పొలం అమ్మకం విషయంలో తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం పడుకున్న చోటే యాదయ్య మృతి చెందాడని భార్య ఇరుగుపొరుగువారితో పాటు మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్ మండలం బోయినపల్లిలో ఉండే అల్లుడు, కుమార్తెకు చెప్పింది. బుధవారం మధ్యాహ్నం అంత్యక్రియలకు సిద్ధమైన సమయంలో మృతదేహానికి స్నానం చేయిస్తుండగా శరీరంపై గాయాలున్నట్టు బంధువులు గుర్తించి అలివేలును నిలదీశారు. దీంతో తానే హత్య చేసినట్టు ఆమె ఒప్పుకొంది. హత్యలో అల్లుడు. కుమార్తెల హస్తం కూడా ఉన్నట్లు యాదయ్య అన్న కుమారుడు పోలీసులకు ఫిర్యాదుచేశారు
Also read
- Vijayawada: సాయికృష్ణ కేసు లో కీలక విషయాలు.. పోలీసు కస్టడీలో మృతి, మృతదేహం మాటేంటి?
- గర్ల్ఫ్రెండ్ ఫోన్ మాట్లాడలేదని మనస్తాపం.. యువకుడి మృతి
- షాకింగ్: కన్నకూతురే రాసిన రక్తచరిత్ర
- అయ్యో జానూ.. పోలీసుల కీలక నిర్ణయం
- గంగమ్మ కస్టోడియల్ డెత్ కేసు ట్విస్ట్.. హైకోర్టు కీలక ఆదేశాలు





