అన్నమయ్య జిల్లా కెవి పల్లి మండలం బండ వడ్డిపల్లిలో సంక్రాంతి సంబరం విషాదాన్ని మిగిల్చింది. పండుగకు సొంతూరుకు వచ్చిన స్నేహితులు సరదాగా గడపాలని ఓ గుట్టుపైకి వెళ్లారు. కానీ ప్రమాదవశాత్తు దానిపై నుంచి పడి ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళ్తే.. బండ వడ్డిపల్లికి చెందిన మణికుమార్, పుష్పరాజ్ అనే ఇద్దరు స్నేహితులు. బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నారు. అయితే సంక్రాంతి పండగ నేపథ్యంలో వీరిద్దరూ సోంతూరైన బండ వడ్డిపల్లికి వచ్చిచారు. మణి కుమార్, పుష్పరాజ్ లు సంక్రాంతి పండుగను సొంతూరులో సంతోషంగానే జరుపుకున్నారు.
అయితే శనివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో మణి కుమార్, పుష్ప రాజ్లు అదే గ్రామానికి చెందిన స్నేహితులు సమీప బంధువులైన అభిషేక్, వేణుగోపాల్, శ్రావణ్, శివమణిలతో కలిసి గ్రామం సమీపంలోని గుట్టపైకి చేరుకున్నారు. అక్కడ కాసేపు ప్రకృతిని ఆస్వాధించి.. ఆ తర్వాత పార్టీ చేసుకున్నారు. ఈ పార్టీలో భాగంగా ఆరుగురు స్నేహితులు తమ వెంట తీసుకెళ్లిన మద్యం సేవించారు. రాత్రి వరకు అక్కడే ఉన్నారు. చీకటి పడడంతో ఇంటికెళ్లేందుకు బయల్దేరారు. ఫుల్గా మద్యంమత్తులో ఉండడంతో గుట్ట దిగే క్రమంలో మణి కుమార్, పుష్పరాజ్ గుట్టపై నుంచి పడిపోయారు.
గమనించిన స్నేహితులు వారిని వెంటనే స్థానిక హాస్పిటల్కు తరలించారు. కానీ అప్పటికే పల్స్ పడిపోవడంతో మణికుమార్, పుష్ప రాజ్ మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం హాస్పిటల్కు తరలించారు. అనంతరం ఘటనపై కేసు నమోదు చేసి.. మృతులతో కలిసి మద్యం సేవించిన నలుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారితో పాటు వెళ్లి ఘటనా స్థలాన్ని పరీశీలించారు. అక్కడ దొరికి బీర్ టిన్స్ ఆధారంగా వీరు అతిగా మద్యం సేవించడంతోనే మృతి చెందినట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.
Also read
- ఇదేం పనయ్యా.. ప్రభుత్వ ఉద్యోగంలో లక్షకుపైగా జీతం.. చేసేదేమో చైన్ స్నాచింగ్లు
- 5 నెలలుగా ఇంటికి తాళం.. అనుమానంతో తెరిచిన ఓనర్.. ఒళ్లు గగుర్పాటుకు గురి చేసే దృశ్యం!
- ఏపీ లిక్కర్ స్కామ్లో విస్తుపోయే వాస్తవాలు.. మద్యం మాఫియా మైండ్ బ్లాక్.. రంగంలోకి ఐటీ!
- అరేయ్.. ఏంట్రా ఇది.. హుండీ లెక్కింపు ఉద్యోగాలు.. అంటూ ఉన్నది మొత్తం ఊడ్చేశాడు.. చివరకు
- చిన్న నిర్లక్ష్యం.. పెను ప్రమాదం.. బ్యాటరీ ఛార్జింగ్ పెడుతుండగా పేలుడు.. బాలుడి చేయి ఛిద్రం!





