అన్నమయ్య జిల్లా కెవి పల్లి మండలం బండ వడ్డిపల్లిలో సంక్రాంతి సంబరం విషాదాన్ని మిగిల్చింది. పండుగకు సొంతూరుకు వచ్చిన స్నేహితులు సరదాగా గడపాలని ఓ గుట్టుపైకి వెళ్లారు. కానీ ప్రమాదవశాత్తు దానిపై నుంచి పడి ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళ్తే.. బండ వడ్డిపల్లికి చెందిన మణికుమార్, పుష్పరాజ్ అనే ఇద్దరు స్నేహితులు. బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నారు. అయితే సంక్రాంతి పండగ నేపథ్యంలో వీరిద్దరూ సోంతూరైన బండ వడ్డిపల్లికి వచ్చిచారు. మణి కుమార్, పుష్పరాజ్ లు సంక్రాంతి పండుగను సొంతూరులో సంతోషంగానే జరుపుకున్నారు.
అయితే శనివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో మణి కుమార్, పుష్ప రాజ్లు అదే గ్రామానికి చెందిన స్నేహితులు సమీప బంధువులైన అభిషేక్, వేణుగోపాల్, శ్రావణ్, శివమణిలతో కలిసి గ్రామం సమీపంలోని గుట్టపైకి చేరుకున్నారు. అక్కడ కాసేపు ప్రకృతిని ఆస్వాధించి.. ఆ తర్వాత పార్టీ చేసుకున్నారు. ఈ పార్టీలో భాగంగా ఆరుగురు స్నేహితులు తమ వెంట తీసుకెళ్లిన మద్యం సేవించారు. రాత్రి వరకు అక్కడే ఉన్నారు. చీకటి పడడంతో ఇంటికెళ్లేందుకు బయల్దేరారు. ఫుల్గా మద్యంమత్తులో ఉండడంతో గుట్ట దిగే క్రమంలో మణి కుమార్, పుష్పరాజ్ గుట్టపై నుంచి పడిపోయారు.
గమనించిన స్నేహితులు వారిని వెంటనే స్థానిక హాస్పిటల్కు తరలించారు. కానీ అప్పటికే పల్స్ పడిపోవడంతో మణికుమార్, పుష్ప రాజ్ మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం హాస్పిటల్కు తరలించారు. అనంతరం ఘటనపై కేసు నమోదు చేసి.. మృతులతో కలిసి మద్యం సేవించిన నలుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారితో పాటు వెళ్లి ఘటనా స్థలాన్ని పరీశీలించారు. అక్కడ దొరికి బీర్ టిన్స్ ఆధారంగా వీరు అతిగా మద్యం సేవించడంతోనే మృతి చెందినట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.
Also read
- రాడ్డుతో చితకబాది.. యాసిడ్ పోసి.. ప్రియుడిని దారుణంగా హతమార్చిన ప్రియురాలు!
- గాజువాకలో 89 అడుగుల గణపతి మండప వివాదం
- వివాహేతర సంబంధం.. మహిళ ఆత్మహత్య!
- యూట్యూబర్ వైష్ణవి భర్త దారుణ హత్య.. కారులో వచ్చి కత్తులతో దారుణంగా..
- బాలికపై లైంగిక దాడి.. ‘క్షమాపణ చెబితే చాలు’ అని తీర్పు!





