విశాఖపట్నం (మాధవధార): విశాఖపట్నంలోని అశోక పార్క్ నేవీ క్యాంటీన్ వద్ద విధి నిర్వహణలో ఉన్న సెక్యూరిటీ ఉద్యోగి గన్ తో కాల్చుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఎయిర్పోర్టు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రకు చెందిన మోరే పరాగ్ సురేష్ రావు(43) నేవీ క్యాంటీన్ వద్ద డీఎస్ సీ (డిఫెన్స్ సెక్యూరిటీ కోర్)గా విధులు నిర్వహిస్తున్నారు. సమీపంలో ఉన్న క్వార్టర్స్లో నివాసం ఉంటున్నారు. శుక్రవారం రాత్రి నేవీ క్యాంటీన్ సమీపంలోని వెడ్ విభాగంలో టవర్-1లో సెంట్రీ విధులకు హాజరయ్యారు.
శనివారం తెల్లవారుజామున తన వద్ద ఉన్న గన్ తో కాల్చుకున్నారు.
కాల్పుల శబ్దం వినిపించడంతో అప్రమత్తమైన సహచర సిబ్బంది అక్కడ వెళ్లి చూడగా అప్పటికే మృతి చెందారు. నేవీ ఉన్నతాధికారుల ద్వారా సమాచారం అందుకున్న ఎయిర్పోర్టు పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. తన మృతికి ఎవరూ కారణం కాదని సురేష్ రాసిన లెటర్ను స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కేజీహెచ్కు తరలించారు. కమాండర్ సుర్జీత్ సింగ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు.
Also read
- Weekly Horoscope: హమ్మయ్య.. వారికి ఆర్థిక కష్టాలు తీరిపోతాయ్..12 రాశులకు వారఫలాలు
- పోస్టుమార్టం నివేదికతో వాస్తవాలు వెలుగులోకి: రాధా గాయత్రి భర్త
- ఆన్ లైన్ ట్రేడింగ్ పేరిట మోసాలు.. ఏడుగురు సభ్యుల ముఠా అరెస్టు
- గన్ తో కాల్చుకొని సెక్యూరిటీ ఉద్యోగి మృతి.
- Golconda: గోల్కొండ కోట వద్ద ఎవరు ఆమె..? వెన్నులో వణుకు పుట్టిస్తున్న వీడియో..





