విజయనగరం, జామి: మా అల్లుడు ముమ్మాటికీ సైకో అని.. అలా ప్రవర్తించే తమ కుమార్తెను బలి తీసుకున్నాడని రాధా గాయత్రి తల్లిదండ్రులు వాపోయారు. కొద్ది రోజుల క్రితం దేహ్రాదూన్లో గాయత్రి అనుమానాస్పదంగా మృతిచెందిన విషయంపై ‘ఈనాడు’తో శుక్రవారం మాట్లాడారు. బిట్స్ పిలానీలో చదివిన విద్యావంతుడని, మంచి భవిత ఉంటుందని భావించి శ్రీచరణ్ గాయత్రి వివాహానికి అంగీకరించామని ఆమె తల్లి సత్యవతి పేర్కొన్నారు. మంచి కుటుంబం, ఉన్నత విద్య కారణంగా తమ కుమార్తె జీవితం సంతోషంగా సాగుతుందని ఆకాంక్షించామన్నారు. పెళ్లైన మూడు నెలలకే గాయత్రిపై మానసిక వేధింపులు ప్రారంభమయ్యాయని ఆరోపించారు.
తల్లిగా తనతో కొన్ని విషయాలు చెప్పినా అన్నీ సర్దుకుంటాయని నచ్చజెప్పేందుకు యత్నించానన్నారు. హైదరాబాద్లో ఒంటరిగా ఉన్న గాయత్రికి తరచూ వీడియో కాల్స్ చేసేవాడని, అనుమానంతో మానసికంగా తీవ్రంగా వేధించేవాడని చెప్పారు. శ్రీచరణ్ ప్రవర్తన సైకో తరహాలో ఉండేదని, ఉద్యోగాల్లో ఎక్కువ కాలం నిలదొక్కుకోలేదని ఇప్పుడు తెలిసిందన్నారు. నిరంతర వేధింపులు, మానసిక ఒత్తిడి కారణంగా తమ కుమార్తె ప్రాణాలు కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పటికే విశాఖ నగర పోలీసు కమిషనర్కు ఫిర్యాదు చేశామని తెలిపారు. నిందితుడికి కఠిన శిక్షపడే వరకు పోరాటం సాగిస్తామన్నారు.
Also read
- ముగ్గురు అక్కాచెల్లెళ్ల అనుమానాస్పద మృతి
- గోదావరిలో ఏపీఎస్పీ కానిస్టేబుల్ మృతదేహం లభ్యం
- ‘మా అల్లుడు సైకో’.. టెకీ రాధా గాయత్రి తల్లిదండ్రులు
- నీట్ కు సిద్ధమవుతున్న విద్యార్థిని బలవన్మరణం
- కన్నబిడ్డలతో రైలు కిందపడి వివాహిత ఆత్మహత్య





