సేలం, : నీట్ పునఃపరీక్ష భయంతో తమిళనాడులో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. సేలం జిల్లా వెల్లాపురానికి చెందిన గోపిక గతంలో నీట్ లో అర్హత సాధించలేకపోవడంతో ఈ ఏడాది మళ్లీ రాసింది. ప్రశ్నపత్రాల లీక్ నేపథ్యంలో నీట్ రద్దు కావడంతో ఈ నెల 21న జరగనున్న పునఃపరీక్షకు సిద్ధమవుతోంది. సరిగా రాయలేనని భయాందోళనకు లోనైన ఆమె శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. కొంగణాపురం పోలీసులు మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం సేలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మూడు రోజుల కిందటే 20వ పుట్టినరోజు జరుపుకొన్న గోపిక ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా విషాదం నింపింది.
Also read
- వెంటాడి.. వేటాడి రౌడీషీటర్ హత్య
- ఠాణాలో భార్యపై కత్తితో దాడి
- తొలి ఏకాదశి.. విష్ణుమూర్తి కృప కోసం 12 రాశుల వారు చేయాల్సిన పరిహారాలు ఇవే!
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- స్లిమ్ చేస్తానని నమ్మించి.. యువతిని హోటల్ రూమ్కు రప్పించిన జిమ్ ట్రైనర్.. ఆపై..!





