సేలం, : నీట్ పునఃపరీక్ష భయంతో తమిళనాడులో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. సేలం జిల్లా వెల్లాపురానికి చెందిన గోపిక గతంలో నీట్ లో అర్హత సాధించలేకపోవడంతో ఈ ఏడాది మళ్లీ రాసింది. ప్రశ్నపత్రాల లీక్ నేపథ్యంలో నీట్ రద్దు కావడంతో ఈ నెల 21న జరగనున్న పునఃపరీక్షకు సిద్ధమవుతోంది. సరిగా రాయలేనని భయాందోళనకు లోనైన ఆమె శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. కొంగణాపురం పోలీసులు మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం సేలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మూడు రోజుల కిందటే 20వ పుట్టినరోజు జరుపుకొన్న గోపిక ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా విషాదం నింపింది.
Also read
- Garuda Purana: దేవుని గదిని ఎప్పుడు శుభ్రం చేయాలి? గరుడ పురాణం చెప్పిన నియమాలు ఇవే!
- Achamanam: పూజకు ముందు ఆచమనం ఎందుకు చేస్తారు? శాస్త్రాలు చెప్పిన ఆధ్యాత్మిక రహస్యం ఇదే
- నేటి జాతకములు 5 ఆగస్టు, 2026
- ‘నన్ను పెళ్లి చేసుకుంటే జన్మ సార్థకం’.. దొంగ బాబా లీలలు! కట్ చేస్తే చితకబాదిన జనాలు
- కుక్కర్లు అమ్మేవారిలా వచ్చి కోట్ల చోరీలు.. ఆదిలాబాద్లో పట్టుబడ్డ అంతర్జాతీయ దొంగల ముఠా





