విజయనగరం, జామి: మా అల్లుడు ముమ్మాటికీ సైకో అని.. అలా ప్రవర్తించే తమ కుమార్తెను బలి తీసుకున్నాడని రాధా గాయత్రి తల్లిదండ్రులు వాపోయారు. కొద్ది రోజుల క్రితం దేహ్రాదూన్లో గాయత్రి అనుమానాస్పదంగా మృతిచెందిన విషయంపై ‘ఈనాడు’తో శుక్రవారం మాట్లాడారు. బిట్స్ పిలానీలో చదివిన విద్యావంతుడని, మంచి భవిత ఉంటుందని భావించి శ్రీచరణ్ గాయత్రి వివాహానికి అంగీకరించామని ఆమె తల్లి సత్యవతి పేర్కొన్నారు. మంచి కుటుంబం, ఉన్నత విద్య కారణంగా తమ కుమార్తె జీవితం సంతోషంగా సాగుతుందని ఆకాంక్షించామన్నారు. పెళ్లైన మూడు నెలలకే గాయత్రిపై మానసిక వేధింపులు ప్రారంభమయ్యాయని ఆరోపించారు.
తల్లిగా తనతో కొన్ని విషయాలు చెప్పినా అన్నీ సర్దుకుంటాయని నచ్చజెప్పేందుకు యత్నించానన్నారు. హైదరాబాద్లో ఒంటరిగా ఉన్న గాయత్రికి తరచూ వీడియో కాల్స్ చేసేవాడని, అనుమానంతో మానసికంగా తీవ్రంగా వేధించేవాడని చెప్పారు. శ్రీచరణ్ ప్రవర్తన సైకో తరహాలో ఉండేదని, ఉద్యోగాల్లో ఎక్కువ కాలం నిలదొక్కుకోలేదని ఇప్పుడు తెలిసిందన్నారు. నిరంతర వేధింపులు, మానసిక ఒత్తిడి కారణంగా తమ కుమార్తె ప్రాణాలు కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పటికే విశాఖ నగర పోలీసు కమిషనర్కు ఫిర్యాదు చేశామని తెలిపారు. నిందితుడికి కఠిన శిక్షపడే వరకు పోరాటం సాగిస్తామన్నారు.
Also read
- మునుకుంట్ల ప్రేమికుల మృతి ఘటనలో ట్విస్ట్..!
- గుంటూరులో నడిరోడ్డుపై.. మహిళను వివస్త్రను చేసి దాడి
- నిద్రిస్తున్న కొడుకు తలపై కర్రతో కొట్టి హతమార్చిన తండ్రి
- 9 ఏళ్ల బాలికతో అసభ్య ప్రవర్తన.. సీసీటీవీ చూసి ఆగ్రహించిన స్థానికుల దాడి, అనుమానితుడు మృతి
- టీ తాగేందుకు రూ.20 ఇవ్వలేదని తలా మొండెం వేరు చేశాడు!





