పెనుకొండ, రొద్దం, : ప్రమాదవశాత్తు పొలంలోని నీటి కుంటలో పడి ముగ్గురు బాలురు మృతి చెందిన విషాద ఘటన శ్రీసత్యసాయి జిల్లా రొద్దం మండలంలో చోటుచేసుకుంది. నారనాగేపల్లి గ్రామానికి చెందిన జవాన్ అజబ్రెడ్డి, కల్పన దంపతుల కుమారులు దరహాన్రెడ్డి (13), హర్షిత్రెడ్డి (10) అనంతపురంలోని ప్రైవేటు పాఠశాలలో చదువుతున్నారు. అజయ్ రెడ్డి మణిపుర్లో సైన్యంలో విధులు నిర్వర్తిస్తున్నారు. వేసవి సెలవుల కోసం అందరూ స్వగ్రామానికి వచ్చారు. రాప్తాడు మండలం పిచ్చిరెడ్డికొట్టాల గ్రామానికి సుధాకర్రెడ్డి, శ్రీదేవి దంపతులకు సృజన్రెడ్డి (13), కుమార్తె సంతానం. ఆరేళ్ల క్రితం శ్రీదేవి భర్త అనారోగ్యంతో మరణించగా, పిల్లలతో కలిసి ఆమె పుట్టినిల్లు నారనాగేపల్లిలో నివసిస్తున్నారు. దరహాస్ రెడ్డి,హర్షిత్రెడ్డి, సృజన్రెడ్డి బుధవారం మధ్యాహ్నం నేరేడు పండ్ల కోసం పొలాల్లోకి వెళ్లారు. పండ్లు కోసుకొని నీటికుంట వైపు వస్తుండగా అందులో జారిపడ్డారు. సమీప పొలాల్లోని వారు గమనించి కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి మృతదేహాలను వెలికితీశారు. బంగారు భవిష్యత్తు ఉన్న బిడ్డలు విగతజీవులుగా మారడంతో బాధిత కుటుంబసభ్యులు గుండెలవిసేలా రోదించారు.
Also read
- ఈ రెండు చెట్లు ఇంట్లో ఉంటే డబ్బు అస్సలు నిలవదట..! మీ ఇంట్లో ఉన్నాయా..?
- Astrology Tips: మీ తలపై బల్లి పడిందా?.. ఆ పెద్ద మార్పుకు టైమ్ దగ్గరపడినట్టే!
- ఇంట్లో శివలింగం పెట్టేముందు ఈ నియమాలు తెలుసుకోండి.. లేదంటే శివదోషం తప్పదట!
- పోలీసులను చూసి పరుగో పరుగు.. పట్టుకుని విచారించగా బయటపడిన షాకింగ్ నిజం
- ఎవడ్రా నువ్వు.. దొంగతనానికి వచ్చి వండుకుని తిని.. పోలిసులకే సవాల్ విసిరావ్..





