చిలకలూరిపేట : పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం పోతవరం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం ఎస్సై చౌడయ్య.. కోటప్పకొండ, చిలకలూరిపేట మీదుగా గుంటూరు వైపు వెళుతున్నారు. అదే మార్గంలో ద్విచక్ర వాహనాలపై వెళుతున్న ప్రకాశం జిల్లా ఉప్పుమాగులూరుకి చెందిన దండా వీరయ్య, చిలకలూరిపేట మండలం మద్దిరాలకు చెందిన షేక్ మస్తాన్ వలీలను ఎస్సై ప్రయాణిస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వీరయ్య అక్కడికక్కడే మృతి చెందగా.. మరో వాహనంపై ఉన్న మస్తాన్ వలీ తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న చిలకలూరిపేట గ్రామీణ ఎస్సై అనిల్ కుమార్ ఘటనా స్థలికి చేరుకుని వీరయ్య మృతదేహాన్ని చిలకలూరిపే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపటారు.
Also read
- ఐ.యఫ్.టి.యు అధ్యక్ష, కార్యదర్శులు గా పామర్తి సత్య, గెడ్డం రవీంద్ర లు.
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- వాస్తు టిప్స్ : ఇంటిలోకి పాము రావడం శుభమా? అశుభమా?
- Garuda Purana: అంత్యక్రియల్లో ఈ కలపలనే ఎందుకు ఉపయోగిస్తారు? గరుడ పురాణం ప్రకారం వాటి విశిష్టత ఇదే
- Guru Purnima: ఆషాఢ పౌర్ణమి రోజున చేయాల్సిన పనులు.. పొరపాటున కూడా చేయకూడని పనులు ఇవే!





