తాడిపత్రి: అనంతపురం జిల్లాలో ఓ నవ వధువు ఆత్మహత్య చేసుకుంది. తాడిపత్రిలోని గన్నవారిపల్లె కాలనీలోని నివాసంలో ఫ్యాన్కు ఉరివేసుకుని లక్ష్మీప్రసన్న(30) బలవన్మనరణానికి పాల్పడింది. తాడిపత్రి ప్రభుత్వ ఆస్పత్రిలో ఫిజియోథెరపిస్టుగా పనిచేస్తున్న ఆమెకు.. గత నెలలో కర్ణాటకలోని కోలార్ జిల్లా నివాసి విజయ్ కుమార్ తో వివాహం జరిగింది. పెళ్లికి ముందే ఒకసారి ఆమె డిప్రెషన్లోకి వెళ్లి ఆత్మహత్యకు యత్నించగా.. తల్లిదండ్రులు రక్షించారు. గురువారం అత్తగారింటికి వెళ్లాల్సి ఉండగా.. ఆమె ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Also read
- వసంత నవరాత్రులు స్టార్ట్! ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు ఇలా చేస్తే ధనలక్ష్మి మీ ఇంట్లోనే ఉంటుంది!
- Lord Shani: శత్రువెవరో మిత్రులెవరో తెలుస్తుంది..! శని దోషం కూడా వీరికి ఒక వరమే!
- Garuda Purana: కాకి పిండం తింటే పితృ దేవతలకు చేరినట్టేనా..? అసలు గరుడ పురాణం ఏం చెప్తుంది
- బాబోయ్.. వీళ్లది మామూలు పత్తేపారం కాదు..! దండెంపై ఆరేసిన జాకెట్ పొరుగింట్లో ప్రత్యక్షం.. ఏరులై పారిన రక్తం
- Vijayawada Accident: ఒక చేత్తో సెల్ఫోన్.. మరో చేత్తో డ్రైవింగ్.. అదుపుతప్పి కిందపడ్డ యువతి





