గొల్లప్రోలు(కాకినాడ) : చేబ్రోలులోని పట్టు పరిశ్రమ కేంద్రం వద్ద అధికారులు తీరుపై పట్టు రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం పట్టు పరిశ్రమ కేంద్రం వద్ద పట్టుగూళ్ళు కొనడం లేదని ఇతర ప్రాంతాలకు తీసుకువెళ్లి అమ్ముకొనివ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులను అడిగితే సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతున్నారని వాపోయారు. బ్యాంకులో తీసుకున్న అప్పులు కట్టలేకపోతున్నామని ఇలాగైతే మాకు ఆత్మహత్యలే శరణ్యమని పట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
జిల్లా పట్టు పరిశ్రమ అధికారిని గీతా రాణి సమస్యను పరిష్కరించాలని పట్టు రైతులు కోరుతున్నారు.
Also read
- టీచర్ కొట్టడంతో యూకేజీ విద్యార్థి మృతి
- Weekly Horoscope: ఉద్యోగంలో గుర్తింపు, ఆర్థిక లాభాలు.. ఈ రాశులకు గోల్డెన్ టైమ్..!
- యువతి రిప్లే ఇవ్వలేదని యువకుడి ఆత్మహత్య!
- విశాఖ షీలానగర్లో మృతదేహాల కలకలం!
- బాడీకి బాంబుల్లా కట్టుకున్నారు.. లోపల ఏముందో చూసి పోలీసులే షాక్!





