గొల్లప్రోలు(కాకినాడ) : చేబ్రోలులోని పట్టు పరిశ్రమ కేంద్రం వద్ద అధికారులు తీరుపై పట్టు రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం పట్టు పరిశ్రమ కేంద్రం వద్ద పట్టుగూళ్ళు కొనడం లేదని ఇతర ప్రాంతాలకు తీసుకువెళ్లి అమ్ముకొనివ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులను అడిగితే సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతున్నారని వాపోయారు. బ్యాంకులో తీసుకున్న అప్పులు కట్టలేకపోతున్నామని ఇలాగైతే మాకు ఆత్మహత్యలే శరణ్యమని పట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
జిల్లా పట్టు పరిశ్రమ అధికారిని గీతా రాణి సమస్యను పరిష్కరించాలని పట్టు రైతులు కోరుతున్నారు.
Also read
- తీవ్ర విషాదం.. బైకులు ఢీకొని ఇద్దరి మృతి
- అన్నమయ్య జిల్లాలో అగ్నిప్రమాదం.. ఒక్కసారిగా మంటలు వ్యాపించి..
- హైదరాబాద్లో డ్రగ్స్ ముఠా గుట్టురట్టు.. అంతర్రాష్ట్ర డ్రగ్ పెడ్లర్ అరెస్ట్..
- పెళ్లికి వెళ్తున్నానని చెప్పి… ప్రియుడితో బిహార్ కు పరార్!
- నేటి జాతకములు 17 ఫిబ్రవరి, 2026





