సూర్యారావుపేట: విజయవాడలో దారుణం చోటు చేసుకుంది. కట్టుకున్న భార్యను.. భర్తే నడిరోడ్డుపై గొంతుకోసి హత్య చేశాడు. మృతురాలిని విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో నర్సుగా పని చేస్తున్న సరస్వతిగా గుర్తించారు. ప్రాథమిక వివరాల ప్రకారం.. కుటుంబ కలహాలతో భార్యాభర్తలు గత కొన్నాళ్లుగా విడివిడిగా ఉంటున్నారు. ఈ క్రమంలో ఆమెపై కోపం పెంచుకున్న భర్త.. నడిరోడ్డుపై ఆమెను హత్య చేశాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Also Read
- బాలుడి ప్రాణం తీసిన ఫోన్ వివాదం
- విశాఖ ఎక్స్ప్రెస్లో దారుణం.. ఏసీ బోగీలో ఖాళీ ఉందని చెప్పి ఆమెను తీసుకెళ్లాడు.. సీన్ కట్ చేస్తే..
- వైశాఖ పౌర్ణమి వేళ రాహు నక్షత్రంలోకి చంద్రుడు.. మే 1 నుంచి 4 రాశుల వారికి తిరుగులేని అదృష్టం
- పూజ ఫలితం రాకపోవడానికి అసలు కారణాలు.. తెలియక చేసే 9 తప్పులు ఇవే
- గరుడపురాణం ప్రకారం ఆత్మకు క్రూరత్వాన్ని చూపించేదే క్రూరపురం – ఆత్మ చేరుకునే 7వ పట్టణం ఇదే..





