సూర్యారావుపేట: విజయవాడలో దారుణం చోటు చేసుకుంది. కట్టుకున్న భార్యను.. భర్తే నడిరోడ్డుపై గొంతుకోసి హత్య చేశాడు. మృతురాలిని విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో నర్సుగా పని చేస్తున్న సరస్వతిగా గుర్తించారు. ప్రాథమిక వివరాల ప్రకారం.. కుటుంబ కలహాలతో భార్యాభర్తలు గత కొన్నాళ్లుగా విడివిడిగా ఉంటున్నారు. ఈ క్రమంలో ఆమెపై కోపం పెంచుకున్న భర్త.. నడిరోడ్డుపై ఆమెను హత్య చేశాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Also Read
- పరారీలో వైసీపీ నేత చింతాడ రవికుమార్
- August 2026 Horoscope: ఆగస్టు మాసంలో వీరి జాతకం మారబోతోంది..! అదృష్ట రాశులివే..
- Viral Video: దొంగ ఎలుక.. రాత్రికి వచ్చి గోల్డ్ షాపులో ఎలా చోరీలు చేస్తుందో చూడండి!
- ఏడాదిగా వెంటాడుతున్నాడు
- నేను చెప్పింది చెయ్! లేదంటే నీ ఫొటోలు అందరికీ..





