సూర్యారావుపేట: విజయవాడలో దారుణం చోటు చేసుకుంది. కట్టుకున్న భార్యను.. భర్తే నడిరోడ్డుపై గొంతుకోసి హత్య చేశాడు. మృతురాలిని విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో నర్సుగా పని చేస్తున్న సరస్వతిగా గుర్తించారు. ప్రాథమిక వివరాల ప్రకారం.. కుటుంబ కలహాలతో భార్యాభర్తలు గత కొన్నాళ్లుగా విడివిడిగా ఉంటున్నారు. ఈ క్రమంలో ఆమెపై కోపం పెంచుకున్న భర్త.. నడిరోడ్డుపై ఆమెను హత్య చేశాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Also Read
- అసంఘటిత కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చెయ్యాలి….పామర్తి సత్యనారాయణ, ఐ.యఫ్.టి.యు .
- ఇంకా దొరకని బాలయ్య ఆచూకీ!
- Shukra Gochar 2026: శుక్రుడి అనుగ్రహం..ఆర్థికంగా ఈ రాశుల వారికి గోల్డెన్ డేస్..!
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- నిడదవోలు నియోజకవర్గం – నిడదవోలు రూరల్ వివిధ గ్రామాలలో”రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి సంక్షేమం, ఇంటింటా తెలుగుదేశం” కార్యక్రమం*





