ఓ మహిళను ఎద్దు రూపంలో మృత్యువు కబలించింది. చెత్త వేసేందుకు వెళ్లిన మహిళపై అక్కడే ఉన్న ఓ ఎద్దు బలంగా దాడి చేసింది. ఈ దాడిలో ఆ మహిళ అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు విడిచింది. అందరూ చూస్తుండగా జరిగిన ఈ విషాద ఘటన మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఓ మహిళను ఎద్దు రూపంలో మృత్యువు కబలించింది. చెత్త వేసేందుకు వెళ్లిన మహిళపై అక్కడే ఉన్న ఓ ఎద్దు బలంగా దాడి చేసింది. ఈ దాడిలో ఆ మహిళ అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు విడిచింది. అందరూ చూస్తుండగా జరిగిన ఈ విషాద ఘటన మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది.
మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలం కృష్ణకాలనీ ఏ సెక్టార్ లో నివాసం ఉంటున్న ఒనపాక కళావతి అలియాస్ కమలమ్మ (52) బుధవారం (నవంబర్ 12) మున్సిపాలిటీ చెత్త బండి ఇంటి సమీపంలోకి రావడం చెత్త వేసేందుకు బయటకు వచ్చింది. కళావతి చెత్తను బండిలో వేసేందుకు వెళ్లగా అక్కడే ఉన్న ఓ ఎద్దు హఠాత్తుగా ఆమెపై దాడి చేసింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ కమలమ్మ అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు విడిచింది. మృతురాలికి ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు ఉండగా.. భర్త ఏడాది క్రితం చనిపోయాడు. తాజాగా ఎద్దు రూపంలో తల్లి మృతి చెందడంతో ఆ కుటుంబ శోకసంద్రంలో మునిగిపోయింది
Also Read
- Andhra Pradesh: ఒక్క రాంగ్ కాల్తో కొంపకొల్లేరు.. సినిమాను మించిన స్టోరీ.. ట్విస్టులు మామూలుగా లేవుగా..
- Andhra: ప్రియుడి మర్మాంగాన్ని కోసిన వివాహిత.. అనంతపురంలో కలకలం
- August Festivals: శ్రావణ మాసం ఆరంభం.. వరలక్ష్మీ వ్రతం నుంచి రాఖీ పౌర్ణమి వరకు ఆగస్టులో ముఖ్య పండుగలు..
- Sankashtahara Chaturthi: సంకష్టహర చతుర్థి.. విఘ్నాలను తొలగించి విజయాన్ని ప్రసాదించే మహత్తర వ్రతం
- Weekly Horoscope: ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం, ఉద్యోగ యోగం.. 12 రాశులకు వారఫలాలు





