ఓ మహిళను ఎద్దు రూపంలో మృత్యువు కబలించింది. చెత్త వేసేందుకు వెళ్లిన మహిళపై అక్కడే ఉన్న ఓ ఎద్దు బలంగా దాడి చేసింది. ఈ దాడిలో ఆ మహిళ అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు విడిచింది. అందరూ చూస్తుండగా జరిగిన ఈ విషాద ఘటన మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఓ మహిళను ఎద్దు రూపంలో మృత్యువు కబలించింది. చెత్త వేసేందుకు వెళ్లిన మహిళపై అక్కడే ఉన్న ఓ ఎద్దు బలంగా దాడి చేసింది. ఈ దాడిలో ఆ మహిళ అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు విడిచింది. అందరూ చూస్తుండగా జరిగిన ఈ విషాద ఘటన మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది.
మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలం కృష్ణకాలనీ ఏ సెక్టార్ లో నివాసం ఉంటున్న ఒనపాక కళావతి అలియాస్ కమలమ్మ (52) బుధవారం (నవంబర్ 12) మున్సిపాలిటీ చెత్త బండి ఇంటి సమీపంలోకి రావడం చెత్త వేసేందుకు బయటకు వచ్చింది. కళావతి చెత్తను బండిలో వేసేందుకు వెళ్లగా అక్కడే ఉన్న ఓ ఎద్దు హఠాత్తుగా ఆమెపై దాడి చేసింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ కమలమ్మ అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు విడిచింది. మృతురాలికి ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు ఉండగా.. భర్త ఏడాది క్రితం చనిపోయాడు. తాజాగా ఎద్దు రూపంలో తల్లి మృతి చెందడంతో ఆ కుటుంబ శోకసంద్రంలో మునిగిపోయింది
Also Read
- పెళ్లి అయినా తర్వాత అరుంధతి నక్షత్రాన్ని ఎందుకు చూపిస్తారు?
- Weekly Horoscope: ఆ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. 12 రాశుల వారికి వారఫలాలు
- ఇన్స్టాగ్రామ్ వేదికగా అమ్మాయిలకు వల…లక్షల్లో వసూలు చేసిన ముఠా గుట్టు రట్టు
- వస్తున్నాయ్ ఫీలింగ్స్!
- నన్ను ఒంటరిగా వదిలేసి ఎలా వెళ్లావు..?





