శ్రీకాకుళం: బాదం పాలు తాగి సుమారు 80 మంది అస్వస్థతకు గురైన ఘటన శ్రీకాకుళం గ్రామీణ మండలం సింగుపురం గ్రామంలో చోటుచేసుకుంది. వారంతా విరేచనాలు, వాంతులు, జ్వరం, కడుపులో నొప్పి, కళ్లు తిరగడం వంటి లక్షణాలతో బాధపడుతున్నారు. శుక్రవారం ఉదయం నుంచి స్థానిక పీహెచ్సీ, ప్రైవేటు ఆసుపత్రుల్లో చేరి చికిత్స పొందుతున్నారు. మామిడివలస ప్రాంతానికి చెందినవారే 25 మంది వరకు అస్వస్థతకు గురయ్యారు. బాధితులు తెలిపిన వివరాల మేరకు ఈ నెల 1, 2వ తేదీల్లో సింగుపురంలో నిర్వహించిన కొండమ్మ తల్లి ఉత్సవాల్లో వేల మంది పాల్గొన్నారు. పాత పంచాయతీ కార్యాలయం వేప చెట్టు కింద ఓ వ్యక్తి వ్యాన్లో బాదం పాలు తీసుకొచ్చి విక్రయించాడు.
ఎండ తీవ్రంగా ఉండటంతో ఉపశమనం పొందడానికి చాలా మంది కొనుగోలు చేసి తాగారు. గురువారం అర్ధరాత్రి నుంచి విపరీతమైన కడుపు నొప్పి రావడంతో ఆసుపత్రుల బాట పట్టారు. ఈ విషయమై కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ను ‘ఈనాడు’ సంప్రదించగా బాధితులకు ప్రాణాపాయం లేదని.. వైద్యులను అందుబాటులో ఉంచి మెరుగైన చికిత్స అందిస్తున్నామని తెలిపారు. ఈ ఘటనపై ప్రత్యేక బృందాన్ని నియమించి సమగ్ర విచారణ చేయిస్తున్నామని చెప్పారు. బాధితులకు అందుతున్న చికిత్స, ప్రస్తుత పరిస్థితిపై మంత్రి అచ్చెన్నాయుడు జిల్లా కలెక్టర్తో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
Also read
- విశాఖ షీలానగర్లో మృతదేహాల కలకలం!
- బాడీకి బాంబుల్లా కట్టుకున్నారు.. లోపల ఏముందో చూసి పోలీసులే షాక్!
- ఆస్తి పిచ్చి.. 62 ఏళ్ల భర్తను భార్య ఏం చేసిందో తెలిస్తే మైండ్ బ్లాంకే..
- Hyderabad: రోడ్డు ప్రమాదం అనుకున్నారు.. కానీ అసలు నిజం తెలిసి పోలీసులే షాక్!
- Andhra Pradesh: పోలీసుల కారు బీభత్సం.. డిక్కీలో గంజాయి, మద్యం బాటిళ్లు.. అసలు ఏం జరిగిందంటే..?





