July 1, 2024
SGSTV NEWS
Andhra PradeshAssembly-Elections 2024Crime

వైకాపా నాయకుడి స్థలంలో 6,240 సీసాల గోవా మద్యం





ఆలమూరు, : డా. బీఆర

Also read ్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆలమూరులోని వైకాపా నాయకుడికి చెందిన ఒక ఇటుక బట్టీలో రూ.7.8 లక్షల విలువైన గోవా మద్యం సీసాలను ఎస్ఈబీ అధికారులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. పెనికేరు రహదారిపై ఉన్న ఈ బట్టీలో మద్యం సీసాలున్నట్లు విశ్వసనీయమైన సమాచారం అందడంతో ఎస్ఈబీ అధికారులు దాడి చేశారు. స్థానిక వైకాపా నాయకుడు, ప్రస్తుతం మండపేట వైకాపా ఎన్నికల పరిశీలకుడుగా ఉన్న సీహెచ్ ప్రభాకరరావు ఈ బట్టీ యజమాని. మొత్తం 130 బాక్సుల్లో ఉన్న 6,240 సీసాల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఈబీ ఎస్సై సత్యవాణి తెలిపారు. అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ అమర్బాబు, రాజోలు సీఐ పి. శ్రీనివాస్, ఫ్లయింగ్ స్క్వాడ్ సభ్యురాలు పోచమ్మ తదితరులు పాల్గొన్నారు.

Related posts

Share via