ఆలమూరు, : డా. బీఆర
Also read ్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆలమూరులోని వైకాపా నాయకుడికి చెందిన ఒక ఇటుక బట్టీలో రూ.7.8 లక్షల విలువైన గోవా మద్యం సీసాలను ఎస్ఈబీ అధికారులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. పెనికేరు రహదారిపై ఉన్న ఈ బట్టీలో మద్యం సీసాలున్నట్లు విశ్వసనీయమైన సమాచారం అందడంతో ఎస్ఈబీ అధికారులు దాడి చేశారు. స్థానిక వైకాపా నాయకుడు, ప్రస్తుతం మండపేట వైకాపా ఎన్నికల పరిశీలకుడుగా ఉన్న సీహెచ్ ప్రభాకరరావు ఈ బట్టీ యజమాని. మొత్తం 130 బాక్సుల్లో ఉన్న 6,240 సీసాల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఈబీ ఎస్సై సత్యవాణి తెలిపారు. అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ అమర్బాబు, రాజోలు సీఐ పి. శ్రీనివాస్, ఫ్లయింగ్ స్క్వాడ్ సభ్యురాలు పోచమ్మ తదితరులు పాల్గొన్నారు.
- ఎంత కష్టమొచ్చిందో.. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి.. లెటర్ రాసి మరీ ఇలా..
- అయ్యో రేవతి.. కొడుకుకు ఈత నేర్పాలనుకుంది.. ఈలోపే ఏమైందంటే..
- మళ్లీ రెచ్చిపోయిన బాపట్ల రైలు దొంగల ముఠా.. అర్ధరాత్రి కాల్పులు జరిపిన రైల్వే పోలీసులు!
- పసికందు విక్రయ ఆరోపణలు కలకలం.. తల్లి అంగీకారంతో కేసులో కొత్త ట్విస్ట్
- రూ.33 లక్షల బకాయి బిల్లు కోసం బడికి తాళం.. రోడ్డున పడ్డ విద్యార్థులు, ఉపాధ్యాయులు!





