ఆలమూరు, : డా. బీఆర
Also read ్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆలమూరులోని వైకాపా నాయకుడికి చెందిన ఒక ఇటుక బట్టీలో రూ.7.8 లక్షల విలువైన గోవా మద్యం సీసాలను ఎస్ఈబీ అధికారులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. పెనికేరు రహదారిపై ఉన్న ఈ బట్టీలో మద్యం సీసాలున్నట్లు విశ్వసనీయమైన సమాచారం అందడంతో ఎస్ఈబీ అధికారులు దాడి చేశారు. స్థానిక వైకాపా నాయకుడు, ప్రస్తుతం మండపేట వైకాపా ఎన్నికల పరిశీలకుడుగా ఉన్న సీహెచ్ ప్రభాకరరావు ఈ బట్టీ యజమాని. మొత్తం 130 బాక్సుల్లో ఉన్న 6,240 సీసాల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఈబీ ఎస్సై సత్యవాణి తెలిపారు. అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ అమర్బాబు, రాజోలు సీఐ పి. శ్రీనివాస్, ఫ్లయింగ్ స్క్వాడ్ సభ్యురాలు పోచమ్మ తదితరులు పాల్గొన్నారు.
- ఇలా తయారయ్యారేంట్రా.. బాకీ తీర్చమని అడిగితే బంగారం ఇచ్చాడు.. తీరా చూస్తే!
- Andhra News: ఎలా వస్తున్నాయ్రా ఇలాంటి ఐడీయాలు.. లవర్స్ను చంపి ఏం చేశాడో తెలిస్తే..
- పెళ్లి తర్వాత ప్రేమ, అడ్డుగా ఉన్న భర్త హత్యకు స్కెచ్! పాపం.. మామ బలి
- నేటి జాతకములు 31 జూలై, 2026
- అసంఘటిత కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చెయ్యాలి….పామర్తి సత్యనారాయణ, ఐ.యఫ్.టి.యు .





