చింతలపూడి: సభ్య సమాజం తలదించుకునే ఘటన ఏలూరుజిల్లా చింతలపూడి మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక ఆడుకుంటూ ఉండగా అదే గ్రామానికి చెందిన ఓ వృద్ధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రెండో తరగతి చదువుతున్న ఓ చిన్నారి రెండు రోజుల క్రితం తన ఇంటి ఆవరణలో ఆడుకుంటోంది.
అదే గ్రామానికి చెందిన రాముడు (53) es బాలికకు మాయమాటలు చెప్పి తన ఇంట్లోకి తీసుకెళ్లాడు. అక్కడ ఆ చిన్నారిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. నిందితుడి బారి నుంచి బయటపడిన బాలిక జరిగిన విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పింది. తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. చింతలపూడి పోలీసులు రాముడుపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అనంతరం నిందితుడిని రిమాండ్కు తరలించినట్టు సీఐ క్రాంతికుమార్ తెలిపారు.
Also read
- ఛీ ఛీ.. నువ్వేం మనిషివిరా.. భార్యపై కోపంతో కూతురిని చంపాడు.. బైక్పై తీసుకెళ్లి..
- విశాఖలో యువతి అనుమానాస్పద మృతి… పార్టీ నుంచి లాడ్జి వరకు ఏమైంది?
- ఉద్యోగం అన్నాడు.. ప్రేయసి నుంచి రూ.18 లక్షలు కాజేశాడు.. కట్చేస్తే..
- అడుగు భూమికోసం ఇంత దారుణమా.. ఈ బుడ్డోడు ఏం చేశాడో తెలిస్తే..
- వారు బైక్పై ఇద్దరు వస్తున్నా.. రాత్రి సమయం అని ఇతనికి లిఫ్ట్ ఇచ్చారు.. కానీ కాసేపటికే..





