అమరావతి.
గుంటూరు బార్ అసోసియేషన్ 2026–27 ఎన్నికలు ఈనెల 31వ తేదీన జరుగుతున్న నేపథ్యంలో ఉమ్మడి గుంటూరు జిల్లాలో ప్రముఖ సీనియర్ న్యాయవాది చింతలపాటి వెంకటరామయ్య (సివిఆర్) అధ్యక్షునిగా మంగళవారం ఉదయం నామినేషన్ వేశారు. పలువురు సీనియర్ న్యాయవాదులు,



జూనియర్ న్యాయవాదులు ఊరేగింపుగా వచ్చి బార్ అసోసియేషన్ ఛాంబర్ కార్యాలయంలో ఎన్నికల అధికారి యంగలశెట్టి శివ సూర్యనారాయణకు నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాజకీయ పార్టీల కతీతంగా ప్రముఖ సీనియర్,జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు. తొలుత కోర్ట్ కాంపౌండ్ లోని న్యాయదేవతల విగ్రహాలకు మరియు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలల అర్పించి ర్యాలీగా వచ్చి నామినేషన్ వేశారు.
Also read
- గరుడపురాణం ప్రకారం ఆత్మ నరకలోక ప్రయాణంలో 8వ పట్టణం విచిత్రభవనం చేరుకోవడానికి ఎన్ని కష్టాలు పడుతుందో తెలుసా..?
- నేటి జాతకములు..2 మే, 2026
- చెడు కొలెస్ట్రాల్ను సహజంగా కరిగించే.. బెస్ట్ డ్రింక్స్ ఇవే!
- Andhra Pradesh: అయ్యో పాపం రాహుల్.. తల్లిదండ్రుల కళ్ల ముందే ప్రాణాలు విడిచి..
- ఎన్నడూ చూడని దృశ్యం.. 20 అడుగుల కొండచిలువ ఎలా చెట్టు ఎక్కుతుందో చూడండి..





