అమరావతి.
గుంటూరు బార్ అసోసియేషన్ 2026–27 ఎన్నికలు ఈనెల 31వ తేదీన జరుగుతున్న నేపథ్యంలో ఉమ్మడి గుంటూరు జిల్లాలో ప్రముఖ సీనియర్ న్యాయవాది చింతలపాటి వెంకటరామయ్య (సివిఆర్) అధ్యక్షునిగా మంగళవారం ఉదయం నామినేషన్ వేశారు. పలువురు సీనియర్ న్యాయవాదులు,



జూనియర్ న్యాయవాదులు ఊరేగింపుగా వచ్చి బార్ అసోసియేషన్ ఛాంబర్ కార్యాలయంలో ఎన్నికల అధికారి యంగలశెట్టి శివ సూర్యనారాయణకు నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాజకీయ పార్టీల కతీతంగా ప్రముఖ సీనియర్,జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు. తొలుత కోర్ట్ కాంపౌండ్ లోని న్యాయదేవతల విగ్రహాలకు మరియు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలల అర్పించి ర్యాలీగా వచ్చి నామినేషన్ వేశారు.
Also read
- ఎంత కష్టమొచ్చిందో.. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి.. లెటర్ రాసి మరీ ఇలా..
- అయ్యో రేవతి.. కొడుకుకు ఈత నేర్పాలనుకుంది.. ఈలోపే ఏమైందంటే..
- మళ్లీ రెచ్చిపోయిన బాపట్ల రైలు దొంగల ముఠా.. అర్ధరాత్రి కాల్పులు జరిపిన రైల్వే పోలీసులు!
- పసికందు విక్రయ ఆరోపణలు కలకలం.. తల్లి అంగీకారంతో కేసులో కొత్త ట్విస్ట్
- రూ.33 లక్షల బకాయి బిల్లు కోసం బడికి తాళం.. రోడ్డున పడ్డ విద్యార్థులు, ఉపాధ్యాయులు!





