యశవంతపుర(బెంగళూరు): నీ భర్తను వదిలిపెట్టాలంటే నువ్వు నా ఇంటికి రావాలి, లేదా రూ.25 లక్షలను ఇచ్చుకో అని ఓ సీఐ మహిళను వేధించిన ఘటన దక్షిణ కన్నడ జిల్లా మూడబిదిరె ఠాణాలో జరిగింది. నేను హోంమంత్రికి రూ.50 లక్షలిచ్చి ఇక్కడికి పోస్టింగ్ తీసుకున్నట్లు సీఐ సందేశ్ చెప్పాడని ఆ మహిళ పేర్కొన్నారు. నాపై ఫిర్యాదు చేసిన నీ భర్తను అరెస్ట్ చేశా, విడిపించుకోవాలంటే రూ.25 లక్షలు డబ్బులివ్వాలంటూ సీఐ సందేశ్ తనను ఒత్తిడి చేశారని సదరు మహిళ మంగళూరు పోలీసు కమిషనర్ కు ఫిర్యాదు చేశారు.
గత ఆగస్ట్లో తన భర్తను అరెస్ట్ చేశారని, విడుదల చేయాలని సీఐ వద్దకు వెళ్లగా అతడు చెప్పిన మాటలు విని షాక్కు గురైనట్లు మహిళ వాపోయింది. ఈ రాత్రికి పడక గదికి రావాలని అసభ్యకరంగా డిమాండ్ చేశాడని మహిళ ఆరోపించింది. నేను హోంమంత్రికి రూ.50 లక్షలిచ్చి ఇక్కడి వచ్చా, నేను అడిగినంత డబ్బులిస్తేనే విడుదల చేస్తా, లేదంటే నీ భర్తపై రౌడీషిట్ను తెరుస్తానంటూ బెదిరించాడని మహిళ ఆరోపించారు. కాగా, ఈ వ్యవహారంపై నివేదిక ఇవ్వాలని జిల్లా ఎస్పీని రాష్ట్ర మహిళా కమిషన్ ఆదేశించింది.
Also read
- నేటి జాతకములు 31 జూలై, 2026
- అసంఘటిత కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చెయ్యాలి….పామర్తి సత్యనారాయణ, ఐ.యఫ్.టి.యు .
- ఇంకా దొరకని బాలయ్య ఆచూకీ!
- Shukra Gochar 2026: శుక్రుడి అనుగ్రహం..ఆర్థికంగా ఈ రాశుల వారికి గోల్డెన్ డేస్..!
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?





