టెంపుల్ సిటీలో స్పా మరక.. ఆధ్మాత్మిక నగరిలో డర్టీ పిక్చర్ కలకలం రేపింది.. తిరుపతిలో బ్రోతల్ దందాచేస్తోన్న స్పా సెంటర్లపై కొరడా తిరుపతి ఈస్ట్ పోలీసులు ఝులిపించారు. SEA 7 స్పా స్పెంటర్లో ముగ్గురు విటులను, నలుగురు యువతుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఆధ్మాత్మిక నగరం తిరుపతిలో అసాంఘీక కార్యకలాపాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఎస్పీ ఆదేశాలతో ఈస్ట్ తిరుపతిలోని 8 స్పాంటర్లపై పోలీసులు ఏకకాలంలో రెయిడ్ నిర్వహించారు. SEA 7 స్పా సెంటర్లో బ్రోతల్ రాకెట్ను బ్రేక్ చేశారు. ఢిల్లీ బ్యాచ్ ఈ దందాను నిర్వహిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. సీ 7 స్పా సెంటర్ లో మేనేజర్గా పనిచేస్తున్న మనీషా.. స్పా ఆర్గనైజర్స్ మహీ ఆమె భర్త అఫ్తాబ్ లపై కేసు నమోదు చేశారు. ఈ దందా వెనుక ఇంకా ఎవరెవరున్నారో కూపీలాగుతున్నారు. స్పిరిచువల్ సిటీ తిరుపతి బ్రాండ్ ఇమేజ్ను డ్యామేజ్ చేయాలని చూస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
స్పా, సెలూన్, మసాజ్ సెంటర్ల పేరుతో అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు గతంలో అభియోగాలున్నాయి.. ఈ విషయంపై తిరుపతి ఎస్పీకి సైతం పలు ఫిర్యాదులు అందాయి.. ఈ నేపథ్యంలో ఫిర్యాదులపై స్పందించిన ఎస్పీ.. దాడులు నిర్వహించాలని ఆదేశించారు.. దీంతో స్పా మసాజ్ సెంటర్ల నిర్వాకం వెలుగులోకి వచ్చింది
తాజా వార్తలు చదవండి
- ఇదేం పనయ్యా.. ప్రభుత్వ ఉద్యోగంలో లక్షకుపైగా జీతం.. చేసేదేమో చైన్ స్నాచింగ్లు
- 5 నెలలుగా ఇంటికి తాళం.. అనుమానంతో తెరిచిన ఓనర్.. ఒళ్లు గగుర్పాటుకు గురి చేసే దృశ్యం!
- ఏపీ లిక్కర్ స్కామ్లో విస్తుపోయే వాస్తవాలు.. మద్యం మాఫియా మైండ్ బ్లాక్.. రంగంలోకి ఐటీ!
- అరేయ్.. ఏంట్రా ఇది.. హుండీ లెక్కింపు ఉద్యోగాలు.. అంటూ ఉన్నది మొత్తం ఊడ్చేశాడు.. చివరకు
- చిన్న నిర్లక్ష్యం.. పెను ప్రమాదం.. బ్యాటరీ ఛార్జింగ్ పెడుతుండగా పేలుడు.. బాలుడి చేయి ఛిద్రం!





