కొడుకుతో కలిసి.. ప్రియుడిని హతమార్చిన మహిళ
జీడిమెట్ల: కొడుకుతో కలిసి, ఓ మహిళ తన ప్రియుడిని హతమార్చింది. ఈ ఘటనహైదరాబాద్ జీడిమెట్ల ఠాణా పరిధిలోని చింతల్ అంబేడ్కర్నగర్లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఏపీలోని అన్నమయ్య జిల్లాకు చెందిన శివారెడ్డి (40)తో కలిసి గత పదేళ్లుగా ఓ మహిళ సహజీవనం చేస్తోంది. 19 ఏళ్ల తన కుమారుడు కూడా వాళ్లతోనే ఉంటున్నాడు. వారిద్దరినీ గత కొన్నాళ్లుగా శివారెడ్డి వేధిస్తుండేవాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి తల్లీ కొడుకులు మటన్ కొట్టే కత్తితో నరికి అతడిని హత్య చేశారు. శవాన్ని ఓ సంచిలో మూటగట్టి తరలించే ప్రయత్నం చేయగా.. ఈ సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
Also read
- విష్ణుమూర్తి నాభి నుంచే పద్మం ఎందుకు పుట్టింది? బ్రహ్మదేవుడి ఆవిర్భావం వెనుక అసలు రహస్యం ఇదే!
- దుర్ముహూర్తం అంటే ఏమిటి? ఈ సమయంలో శుభకార్యాలు ఎందుకు చేయరు? కారణం ఇదే!
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- ప్రియుడితో వెళ్లి.. శవమై తేలిన వివాహిత.. హత్య మిస్టరీని ఛేదించిన పోలీసులు!
- Hyderabad: డబ్బు తీసుకుంది కొడుకు.. చంపింది మాత్రం తండ్రిని.. అసలు ఏం జరిగిందంటే?





