కొడుకుతో కలిసి.. ప్రియుడిని హతమార్చిన మహిళ
జీడిమెట్ల: కొడుకుతో కలిసి, ఓ మహిళ తన ప్రియుడిని హతమార్చింది. ఈ ఘటనహైదరాబాద్ జీడిమెట్ల ఠాణా పరిధిలోని చింతల్ అంబేడ్కర్నగర్లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఏపీలోని అన్నమయ్య జిల్లాకు చెందిన శివారెడ్డి (40)తో కలిసి గత పదేళ్లుగా ఓ మహిళ సహజీవనం చేస్తోంది. 19 ఏళ్ల తన కుమారుడు కూడా వాళ్లతోనే ఉంటున్నాడు. వారిద్దరినీ గత కొన్నాళ్లుగా శివారెడ్డి వేధిస్తుండేవాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి తల్లీ కొడుకులు మటన్ కొట్టే కత్తితో నరికి అతడిని హత్య చేశారు. శవాన్ని ఓ సంచిలో మూటగట్టి తరలించే ప్రయత్నం చేయగా.. ఈ సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
Also read
- కొడుకుతో కలిసి.. ప్రియుడిని హతమార్చిన మహిళ
- ధాన్యం కుప్పపైనే ప్రాణాలొదిలిన అన్నదాత
- ఇంటి తాళాలు పగలగొట్టి సినిపక్కీలో భారీ చోరీ.. 12 రోజుల తర్వాత ఎట్టకేలకు చిక్కిన అన్నదమ్ములు!
- నిశ్చితార్థమయ్యింది.. కానీ ..!
- అధిక మాసం రహస్యాలు.. జ్యేష్ఠ మాసంలో తప్పక చేయాల్సిన పూజలు, నియమాలు..





