కొడుకుతో కలిసి.. ప్రియుడిని హతమార్చిన మహిళ
జీడిమెట్ల: కొడుకుతో కలిసి, ఓ మహిళ తన ప్రియుడిని హతమార్చింది. ఈ ఘటనహైదరాబాద్ జీడిమెట్ల ఠాణా పరిధిలోని చింతల్ అంబేడ్కర్నగర్లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఏపీలోని అన్నమయ్య జిల్లాకు చెందిన శివారెడ్డి (40)తో కలిసి గత పదేళ్లుగా ఓ మహిళ సహజీవనం చేస్తోంది. 19 ఏళ్ల తన కుమారుడు కూడా వాళ్లతోనే ఉంటున్నాడు. వారిద్దరినీ గత కొన్నాళ్లుగా శివారెడ్డి వేధిస్తుండేవాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి తల్లీ కొడుకులు మటన్ కొట్టే కత్తితో నరికి అతడిని హత్య చేశారు. శవాన్ని ఓ సంచిలో మూటగట్టి తరలించే ప్రయత్నం చేయగా.. ఈ సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
Also read
- ప్లాట్ ఫారం రిక్షా కార్మికులకు “” రిక్షా స్టాండ్”” ఏర్పాటు చెయ్యాలని మంత్రి గారికి వినతిపత్రం…..ఐ.యఫ్.టి.యు.
- బ్రహ్మపుత్ర నదిలో పడి జమ్మలమడుగు యువతి మృతి
- కళ్లల్లో కారం చల్లి… కత్తులతో నరికి… RMP డాక్టర్ హత్య కేసులో షాకింగ్ ట్విస్ట్..!
- Video: రీల్స్తో వివాదం.. రాజీనామా చేసిన ప్రభుత్వ టీచర్! కన్నీళ్లు పెట్టుకుంటూ..
- ఇంకా దొరకని రాము.. నీతు.. గుండెల్ని పిండేస్తున్న ఘటన..





