ఇబ్రహీంపట్నం, : ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకోవడానికి ధాన్యం కొనుగోలు కేంద్రం వద్దకు వచ్చిన రైతు వడదెబ్బకు గురై ధాన్యం కుప్పపైనే ప్రాణాలు వదిలారు. ఈ హృదయవిదారక ఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం రాయపోల్లో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గౌరయ్య(60) అర ఎకరం సొంత పొలంతో పాటు మరికొంత కౌలుకు తీసుకుని వరి సాగు చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రానికి మూడు రోజుల కిందట వడ్లను తీసుకొచ్చారు. అక్కడే రోజూ ఆరబెడుతున్నారు. ఆదివారం సాయంత్రం వర్షం వస్తుందేమోనని ఆరబెట్టిన వడ్లను కుప్పగా చేస్తుండగా వడదెబ్బకు గురై మృతి చెందారు. ఆయనకు భార్య వెంకటమ్మ, ఇద్దరు కుమారులు ఉన్నారు. గౌరయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని భారాస జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.
Also read
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- అయ్యో తాత.. మనవడిని బతికించి ప్రాణాలు వదిలేశాడు.. అసలేం జరిగిందంటే..?
- పోక్సో కేసులో కానిస్టేబులకు 31 ఏళ్ల జైలు
- ప్రేమ పేరుతో నర్సును గర్భవతిని చేసిన డాక్టర్
- ఇళ్లు ఉడ్చేందుకు లైట్ స్విచ్ వేసిన పని మనిషి.. ఇంతలోనే భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..





